Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: February 24, 2026 04:19 AM

బురద మడిలో మునిగి రైతు మృతి

బురద మడిలో మునిగి రైతు మృతి

బురద మడిలో మునిగి రైతు మృతి
December 29, 2025 06:49 PM 471 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
స్థానికం బృందం

రామన్నపేటలో అనుమానాస్పద ఘటన

రామన్నపేట:స్థానికం ప్రతినిధి

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని శోబనద్రిపురం గ్రామానికి చెందిన రైతు బోడిగే నరేష్ (35) బురద మడిలో మునిగి మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

పోలీసుల కథనం ప్రకారం.. 28.12.2025న నరేష్ మధ్యాహ్నం సమయంలో ప్రతిరోజులాగే తన వ్యవసాయ పొలానికి వెళ్లాడు. సాయంత్రం వరకు ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు అతడికి ఫోన్ చేయగా స్పందన లేకపోయింది. దీంతో భార్య బోడిగే మాధవి ఆందోళన చెంది తన బావ బోడిగే రమేష్‌కు సమాచారం ఇచ్చింది.

వారు ఇద్దరూ సాయంత్రం సుమారు 5.20 గంటలకు పొలం వద్దకు వెళ్లి వెతకగా, ముత్యాలమ్మ గుడి వెనుక ఉన్న బురద మడిలో నరేష్ మునిగి మృతి చెంది ఉన్నట్లు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు.

మృతుడికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. నరేష్ ప్రమాదవశాత్తు బురదలో జారి పడి మృతి చెందినాడా? లేక మరే ఇతర కారణాలున్నాయా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నట్లు రామన్నపేట ఎస్‌ఐ డి. నాగరాజు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News