Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 02:59 AM

బాత్రూములకు తక్షణమే డోర్లు ఏర్పాటు చేయాలి. సబ్‌కలెక్టర్‌కు బీజేపీ నాయకుల వినతి

బాత్రూములకు తక్షణమే డోర్లు ఏర్పాటు చేయాలి. సబ్‌కలెక్టర్‌కు బీజేపీ నాయకుల వినతి

బాత్రూములకు తక్షణమే డోర్లు ఏర్పాటు చేయాలి.  సబ్‌కలెక్టర్‌కు బీజేపీ నాయకుల వినతి
18-05-2026 61 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఆదోని,: ఆదోని పట్టణంలోని బావాజీ పేట 2వ వార్డు, హనుమన్నగర్‌ 39వ వార్డులో మున్సిపాలిటీ నిర్మించిన బాత్రూములకు డోర్లు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బీజేపీ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలు మరింత అసౌకర్యానికి గురవుతున్నారని పేర్కొంటూ సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరారు.

ఈ మేరకు గౌరవ ఎమ్మెల్యే డాక్టర్‌ వాల్మీకి పార్థసారథి దృష్టికి సమస్యను తీసుకెళ్లడంతో పాటు సబ్‌కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. మున్సిపల్‌ కమిషనర్‌ నయూం వెంటనే స్పందించి బాత్రూములకు డోర్లు ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు.

వినతిపత్రం సమర్పించిన వారిలో ఆదోని బీజేపీ నాయకులు, మాజీ కౌన్సిలర్‌ ఏవీ సురేష్‌, కర్నూలు జిల్లా ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షుడు, నార్త్‌ పట్టణ అధ్యక్షుడు మహాదేవ్‌, సీనియర్‌ నాయకుడు లాయర్‌ లోకేష్‌, పట్టణ అధ్యక్షుడు నాగార్జున, నాయకులు వాల్మీకి చంద్ర, శ్రీకాంత్‌, రామకృష్ణ, ప్రశాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

బాత్రూములకు తక్షణమే డోర్లు ఏర్పాటు చేయాలి. సబ్‌కలెక్టర్‌కు బీజేపీ నాయకుల వినతి

Article Image

ఆదోని,: ఆదోని పట్టణంలోని బావాజీ పేట 2వ వార్డు, హనుమన్నగర్‌ 39వ వార్డులో మున్సిపాలిటీ నిర్మించిన బాత్రూములకు డోర్లు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బీజేపీ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలు మరింత అసౌకర్యానికి గురవుతున్నారని పేర్కొంటూ సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరారు.

ఈ మేరకు గౌరవ ఎమ్మెల్యే డాక్టర్‌ వాల్మీకి పార్థసారథి దృష్టికి సమస్యను తీసుకెళ్లడంతో పాటు సబ్‌కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. మున్సిపల్‌ కమిషనర్‌ నయూం వెంటనే స్పందించి బాత్రూములకు డోర్లు ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు.

వినతిపత్రం సమర్పించిన వారిలో ఆదోని బీజేపీ నాయకులు, మాజీ కౌన్సిలర్‌ ఏవీ సురేష్‌, కర్నూలు జిల్లా ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షుడు, నార్త్‌ పట్టణ అధ్యక్షుడు మహాదేవ్‌, సీనియర్‌ నాయకుడు లాయర్‌ లోకేష్‌, పట్టణ అధ్యక్షుడు నాగార్జున, నాయకులు వాల్మీకి చంద్ర, శ్రీకాంత్‌, రామకృష్ణ, ప్రశాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News