బాత్రూములకు తక్షణమే డోర్లు ఏర్పాటు చేయాలి. సబ్కలెక్టర్కు బీజేపీ నాయకుల వినతి
బాత్రూములకు తక్షణమే డోర్లు ఏర్పాటు చేయాలి. సబ్కలెక్టర్కు బీజేపీ నాయకుల వినతి
Editor Desk
ఆదోని,: ఆదోని పట్టణంలోని బావాజీ పేట 2వ వార్డు, హనుమన్నగర్ 39వ వార్డులో మున్సిపాలిటీ నిర్మించిన బాత్రూములకు డోర్లు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బీజేపీ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలు మరింత అసౌకర్యానికి గురవుతున్నారని పేర్కొంటూ సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరారు.
ఈ మేరకు గౌరవ ఎమ్మెల్యే డాక్టర్ వాల్మీకి పార్థసారథి దృష్టికి సమస్యను తీసుకెళ్లడంతో పాటు సబ్కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. మున్సిపల్ కమిషనర్ నయూం వెంటనే స్పందించి బాత్రూములకు డోర్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
వినతిపత్రం సమర్పించిన వారిలో ఆదోని బీజేపీ నాయకులు, మాజీ కౌన్సిలర్ ఏవీ సురేష్, కర్నూలు జిల్లా ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షుడు, నార్త్ పట్టణ అధ్యక్షుడు మహాదేవ్, సీనియర్ నాయకుడు లాయర్ లోకేష్, పట్టణ అధ్యక్షుడు నాగార్జున, నాయకులు వాల్మీకి చంద్ర, శ్రీకాంత్, రామకృష్ణ, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి