Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! బస్టాండ్‌ వద్ద ‘అండర్‌ పాస్‌’ నిర్మించాలి ​- ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి కౌన్సిలర్‌ వినతి ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 04:43 AM

బస్టాండ్‌ వద్ద ‘అండర్‌ పాస్‌’ నిర్మించాలి ​- ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి కౌన్సిలర్‌ వినతి

బస్టాండ్‌ వద్ద ‘అండర్‌ పాస్‌’ నిర్మించాలి ​- ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి కౌన్సిలర్‌ వినతి

బస్టాండ్‌ వద్ద ‘అండర్‌ పాస్‌’ నిర్మించాలి ​- ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి కౌన్సిలర్‌ వినతి
April 10, 2026 02:48 AM 2 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

​- వంతెన నిర్మాణంతో ప్రజలకు తప్పని తిప్పలు

​- పట్టణ భవిష్యత్తు దృష్ట్యా కీలకమని విజ్ఞప్తి

​చౌటుప్పల్‌ పట్టణ కేంద్రంలోని బస్టాండ్‌ సమీపంలో ప్రజలు, వాహనదారుల సౌకర్యార్థం వెంటనే భూగర్భ రహదారి (అండర్‌ పాస్‌) నిర్మించాలని 17వ వార్డు కౌన్సిలర్‌ చింతల ఉమామహేశ్వరి కోరారు. ఈ మేరకు గురువారం ఆమె మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. 65వ నంబరు జాతీయ రహదారిపై ప్రస్తుతం జరుగుతున్న వంతెన నిర్మాణ పనుల వల్ల స్థానికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.పైలాన్‌ పార్కు నుంచి అంబేడ్కర్‌ చౌరస్తా వరకు మట్టితో వంతెన నిర్మిస్తున్నారని, కెనరా బ్యాంకు వద్ద అండర్‌ పాసింగ్‌ సౌకర్యం కల్పించారని కౌన్సిలర్‌ పేర్కొన్నారు. అయితే, నిత్యం వేలాది మంది ప్రయాణికులతో కిటకిటలాడే బస్టాండ్‌ ప్రాంతంలో అండర్‌ పాస్‌ లేకపోవడం శోచనీయమన్నారు. దీనివల్ల 16, 17, 18, 20 వార్డుల ప్రజలతో పాటు బంగారిగడ్డ వాసులు రోడ్డు దాటాలంటే కిలోమీటర్ల మేర అదనంగా ప్రయాణించాల్సి వస్తోందని వివరించారు.బస్టాండ్‌లో దిగిన మహిళలు, వృద్ధులు రోడ్డు దాటడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఇది ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో చౌటుప్పల్‌ నియోజకవర్గ కేంద్రంగా రూపాంతరం చెందే అవకాశం ఉన్నందున, ఇప్పటి నుంచే శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు. ప్రజా అవసరాలను గుర్తించి యుద్ధ ప్రాతిపదికన బస్టాండ్‌ వద్ద అండర్‌ పాస్‌ ఏర్పాటుకు కృషి చేయాలని ఎమ్మెల్యేను కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News