Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పోలీసుల ఆరోగ్యరక్షణకు ‘సహస్ర’ అండ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 03:55 PM

బస్టాండ్‌ వద్ద ‘అండర్‌ పాస్‌’ నిర్మించాలి ​- ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి కౌన్సిలర్‌ వినతి

బస్టాండ్‌ వద్ద ‘అండర్‌ పాస్‌’ నిర్మించాలి ​- ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి కౌన్సిలర్‌ వినతి

బస్టాండ్‌ వద్ద ‘అండర్‌ పాస్‌’ నిర్మించాలి ​- ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి కౌన్సిలర్‌ వినతి
April 10, 2026 02:48 AM 104 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

​- వంతెన నిర్మాణంతో ప్రజలకు తప్పని తిప్పలు

​- పట్టణ భవిష్యత్తు దృష్ట్యా కీలకమని విజ్ఞప్తి

​చౌటుప్పల్‌ పట్టణ కేంద్రంలోని బస్టాండ్‌ సమీపంలో ప్రజలు, వాహనదారుల సౌకర్యార్థం వెంటనే భూగర్భ రహదారి (అండర్‌ పాస్‌) నిర్మించాలని 17వ వార్డు కౌన్సిలర్‌ చింతల ఉమామహేశ్వరి కోరారు. ఈ మేరకు గురువారం ఆమె మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. 65వ నంబరు జాతీయ రహదారిపై ప్రస్తుతం జరుగుతున్న వంతెన నిర్మాణ పనుల వల్ల స్థానికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.పైలాన్‌ పార్కు నుంచి అంబేడ్కర్‌ చౌరస్తా వరకు మట్టితో వంతెన నిర్మిస్తున్నారని, కెనరా బ్యాంకు వద్ద అండర్‌ పాసింగ్‌ సౌకర్యం కల్పించారని కౌన్సిలర్‌ పేర్కొన్నారు. అయితే, నిత్యం వేలాది మంది ప్రయాణికులతో కిటకిటలాడే బస్టాండ్‌ ప్రాంతంలో అండర్‌ పాస్‌ లేకపోవడం శోచనీయమన్నారు. దీనివల్ల 16, 17, 18, 20 వార్డుల ప్రజలతో పాటు బంగారిగడ్డ వాసులు రోడ్డు దాటాలంటే కిలోమీటర్ల మేర అదనంగా ప్రయాణించాల్సి వస్తోందని వివరించారు.బస్టాండ్‌లో దిగిన మహిళలు, వృద్ధులు రోడ్డు దాటడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఇది ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో చౌటుప్పల్‌ నియోజకవర్గ కేంద్రంగా రూపాంతరం చెందే అవకాశం ఉన్నందున, ఇప్పటి నుంచే శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు. ప్రజా అవసరాలను గుర్తించి యుద్ధ ప్రాతిపదికన బస్టాండ్‌ వద్ద అండర్‌ పాస్‌ ఏర్పాటుకు కృషి చేయాలని ఎమ్మెల్యేను కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News