Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 09:07 AM

బస్టాండ్‌ వద్ద ‘అండర్‌ పాస్‌’ నిర్మించాలి ​- ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి కౌన్సిలర్‌ వినతి

బస్టాండ్‌ వద్ద ‘అండర్‌ పాస్‌’ నిర్మించాలి ​- ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి కౌన్సిలర్‌ వినతి

బస్టాండ్‌ వద్ద ‘అండర్‌ పాస్‌’ నిర్మించాలి ​- ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి కౌన్సిలర్‌ వినతి
10-04-2026 112 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

​- వంతెన నిర్మాణంతో ప్రజలకు తప్పని తిప్పలు

​- పట్టణ భవిష్యత్తు దృష్ట్యా కీలకమని విజ్ఞప్తి

​చౌటుప్పల్‌ పట్టణ కేంద్రంలోని బస్టాండ్‌ సమీపంలో ప్రజలు, వాహనదారుల సౌకర్యార్థం వెంటనే భూగర్భ రహదారి (అండర్‌ పాస్‌) నిర్మించాలని 17వ వార్డు కౌన్సిలర్‌ చింతల ఉమామహేశ్వరి కోరారు. ఈ మేరకు గురువారం ఆమె మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. 65వ నంబరు జాతీయ రహదారిపై ప్రస్తుతం జరుగుతున్న వంతెన నిర్మాణ పనుల వల్ల స్థానికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.పైలాన్‌ పార్కు నుంచి అంబేడ్కర్‌ చౌరస్తా వరకు మట్టితో వంతెన నిర్మిస్తున్నారని, కెనరా బ్యాంకు వద్ద అండర్‌ పాసింగ్‌ సౌకర్యం కల్పించారని కౌన్సిలర్‌ పేర్కొన్నారు. అయితే, నిత్యం వేలాది మంది ప్రయాణికులతో కిటకిటలాడే బస్టాండ్‌ ప్రాంతంలో అండర్‌ పాస్‌ లేకపోవడం శోచనీయమన్నారు. దీనివల్ల 16, 17, 18, 20 వార్డుల ప్రజలతో పాటు బంగారిగడ్డ వాసులు రోడ్డు దాటాలంటే కిలోమీటర్ల మేర అదనంగా ప్రయాణించాల్సి వస్తోందని వివరించారు.బస్టాండ్‌లో దిగిన మహిళలు, వృద్ధులు రోడ్డు దాటడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఇది ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో చౌటుప్పల్‌ నియోజకవర్గ కేంద్రంగా రూపాంతరం చెందే అవకాశం ఉన్నందున, ఇప్పటి నుంచే శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు. ప్రజా అవసరాలను గుర్తించి యుద్ధ ప్రాతిపదికన బస్టాండ్‌ వద్ద అండర్‌ పాస్‌ ఏర్పాటుకు కృషి చేయాలని ఎమ్మెల్యేను కోరారు.

Sthanikam

బస్టాండ్‌ వద్ద ‘అండర్‌ పాస్‌’ నిర్మించాలి ​- ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి కౌన్సిలర్‌ వినతి

Article Image

​- వంతెన నిర్మాణంతో ప్రజలకు తప్పని తిప్పలు

​- పట్టణ భవిష్యత్తు దృష్ట్యా కీలకమని విజ్ఞప్తి

​చౌటుప్పల్‌ పట్టణ కేంద్రంలోని బస్టాండ్‌ సమీపంలో ప్రజలు, వాహనదారుల సౌకర్యార్థం వెంటనే భూగర్భ రహదారి (అండర్‌ పాస్‌) నిర్మించాలని 17వ వార్డు కౌన్సిలర్‌ చింతల ఉమామహేశ్వరి కోరారు. ఈ మేరకు గురువారం ఆమె మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. 65వ నంబరు జాతీయ రహదారిపై ప్రస్తుతం జరుగుతున్న వంతెన నిర్మాణ పనుల వల్ల స్థానికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.పైలాన్‌ పార్కు నుంచి అంబేడ్కర్‌ చౌరస్తా వరకు మట్టితో వంతెన నిర్మిస్తున్నారని, కెనరా బ్యాంకు వద్ద అండర్‌ పాసింగ్‌ సౌకర్యం కల్పించారని కౌన్సిలర్‌ పేర్కొన్నారు. అయితే, నిత్యం వేలాది మంది ప్రయాణికులతో కిటకిటలాడే బస్టాండ్‌ ప్రాంతంలో అండర్‌ పాస్‌ లేకపోవడం శోచనీయమన్నారు. దీనివల్ల 16, 17, 18, 20 వార్డుల ప్రజలతో పాటు బంగారిగడ్డ వాసులు రోడ్డు దాటాలంటే కిలోమీటర్ల మేర అదనంగా ప్రయాణించాల్సి వస్తోందని వివరించారు.బస్టాండ్‌లో దిగిన మహిళలు, వృద్ధులు రోడ్డు దాటడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఇది ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో చౌటుప్పల్‌ నియోజకవర్గ కేంద్రంగా రూపాంతరం చెందే అవకాశం ఉన్నందున, ఇప్పటి నుంచే శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు. ప్రజా అవసరాలను గుర్తించి యుద్ధ ప్రాతిపదికన బస్టాండ్‌ వద్ద అండర్‌ పాస్‌ ఏర్పాటుకు కృషి చేయాలని ఎమ్మెల్యేను కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News