Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 04:36 AM

బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికల్లో దళిత సర్పంచుల పేర్లు తొలగింపు. కొడారి వెంకటేష్

బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికల్లో దళిత సర్పంచుల పేర్లు తొలగింపు. కొడారి వెంకటేష్

బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికల్లో దళిత సర్పంచుల పేర్లు తొలగింపు. కొడారి వెంకటేష్
February 09, 2026 07:43 PM 526 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

బహుజనులకు అవమానం – మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు

యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం పడమటి సోమారం, భువనగిరి మండలం బండసోమారం గ్రామాల్లో నిర్వహించిన శివరాత్రి ఉత్సవాల సందర్భంగా జరిగిన బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికల్లో గ్రామ సర్పంచుల పేర్లు ముద్రించకపోవడం దళిత–బహుజన వర్గాలకు తీవ్ర అవమానమని జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యుడు బర్రె సుదర్శన్, సామాజిక కార్యకర్త కొడారి వెంకటేష్ తీవ్రంగా ఖండించారు.సోమవారం వారు మీడియాతో మాట్లాడుతూ, పడమటి సోమారం గ్రామంలో శ్రీ లింగభసవేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికలో గ్రామ సర్పంచ్ బద్దం అంజయ్య పేరు ఉద్దేశపూర్వకంగా తొలగించారని ఆరోపించారు. అదే విధంగా బండసోమారం గ్రామంలో శ్రీ రామలింగేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవ ఆహ్వాన పత్రికలో గ్రామ సర్పంచ్ కాటిక జంగయ్య పేరు ముద్రించకపోవడం తీవ్ర అన్యాయమని పేర్కొన్నారు.గ్రామ సర్పంచ్ అనేది రాజ్యాంగబద్ధమైన పదవని, గ్రామ ప్రథమ పౌరునిగా ఆయనకు ఉండాల్సిన గౌరవాన్ని కాలరాయడం అత్యంత దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు. దళితుడు సర్పంచ్ కావడమే కారణంగా ఈ విధమైన అవమానాలకు పాల్పడటం రాజ్యాంగ విలువలకు విరుద్ధమని స్పష్టం చేశారు.కొంతమంది వ్యక్తుల ఒత్తిళ్లకు లోబడి అధికారులు ఈ విధంగా వ్యవహరిస్తే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ ఘటనపై మానవ హక్కుల కమిషన్‌కు, ఎస్సీ ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు ప్రకటించారు. అలాగే బాధ్యులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు చేయాలని వారు డిమాండ్ చేశారు.

దేవాలయ ఉత్సవాలు సమానత్వానికి ప్రతీక కావాల్సిన సందర్భంలో వివక్షకు వేదికలుగా మారడం బాధాకరమని, దళిత–బహుజన గౌరవాన్ని కాపాడేందుకు ఉద్యమిస్తామని వారు స్పష్టం చేశారు.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News