శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో ఇటీవల జరిగిన సంఘటనల నేపథ్యంలో శాంతి, సామరస్యాన్ని కాపాడేందుకు పీస్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి తహసీల్దార్, ఎంపీడీవో, ఎస్సైతో పాటు గ్రామ పెద్దలు, యువకులు హాజరయ్యారు.
గ్రామంలో శాంతిభద్రతలు కొనసాగించేందుకు పరస్పర గౌరవం, మత సామరస్యంపై చర్చించారు. చిన్న వివాదాలను పెద్ద సమస్యలుగా మారనీయకుండా చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు.
అసత్య ప్రచారం, రూమర్లు, ద్వేషపూరిత వ్యాఖ్యలపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. పండుగలు, మతపరమైన కార్యక్రమాలు ముందస్తు అనుమతితో శాంతియుతంగా నిర్వహించాలని నిర్ణయించారు.
గ్రామంలో శాంతి భద్రతల కోసం ప్రజలు పోలీసులకు సహకరించాలని అధికారులు కోరారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి