Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నాగార్జున స్కూల్‌కు అంతర్జాతీయ అవార్డు బీదానపల్లిలో 10వ తరగతి ఉత్తీర్ణులకు ఘన అభినందనలు 15 వేల కేసులు 10 నెలల్లో: పెనాల్టీ ఎంత… న్యాయం ఎంత? రాజావాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు చిత్రపటానికి నివాళులు అర్పించిన కలెక్టర్ వాసవీ మాత జయంతి వేడుకల్లో మంత్రి సవిత పాల్గొనడం ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: May 02, 2026 04:38 PM

బ్రాహ్మణపల్లి: పీస్ కమిటీ సమావేశం

బ్రాహ్మణపల్లి: పీస్ కమిటీ సమావేశం

బ్రాహ్మణపల్లి: పీస్ కమిటీ సమావేశం
May 02, 2026 02:29 PM 2 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో ఇటీవల జరిగిన సంఘటనల నేపథ్యంలో శాంతి, సామరస్యాన్ని కాపాడేందుకు పీస్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి తహసీల్దార్, ఎంపీడీవో, ఎస్సైతో పాటు గ్రామ పెద్దలు, యువకులు హాజరయ్యారు.


గ్రామంలో శాంతిభద్రతలు కొనసాగించేందుకు పరస్పర గౌరవం, మత సామరస్యంపై చర్చించారు. చిన్న వివాదాలను పెద్ద సమస్యలుగా మారనీయకుండా చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు.


అసత్య ప్రచారం, రూమర్లు, ద్వేషపూరిత వ్యాఖ్యలపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. పండుగలు, మతపరమైన కార్యక్రమాలు ముందస్తు అనుమతితో శాంతియుతంగా నిర్వహించాలని నిర్ణయించారు.


గ్రామంలో శాంతి భద్రతల కోసం ప్రజలు పోలీసులకు సహకరించాలని అధికారులు కోరారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News