Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా 13వ వార్డు కౌన్సిలర్ గుర్రాల సంతోష శ్రీనివాస్ జన్మదిన వేడుకలు 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 03, 2026 07:07 AM

బ్రాహ్మణపల్లి: పీస్ కమిటీ సమావేశం

బ్రాహ్మణపల్లి: పీస్ కమిటీ సమావేశం

బ్రాహ్మణపల్లి: పీస్ కమిటీ సమావేశం
May 02, 2026 02:29 PM 77 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో ఇటీవల జరిగిన సంఘటనల నేపథ్యంలో శాంతి, సామరస్యాన్ని కాపాడేందుకు పీస్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి తహసీల్దార్, ఎంపీడీవో, ఎస్సైతో పాటు గ్రామ పెద్దలు, యువకులు హాజరయ్యారు.


గ్రామంలో శాంతిభద్రతలు కొనసాగించేందుకు పరస్పర గౌరవం, మత సామరస్యంపై చర్చించారు. చిన్న వివాదాలను పెద్ద సమస్యలుగా మారనీయకుండా చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు.


అసత్య ప్రచారం, రూమర్లు, ద్వేషపూరిత వ్యాఖ్యలపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. పండుగలు, మతపరమైన కార్యక్రమాలు ముందస్తు అనుమతితో శాంతియుతంగా నిర్వహించాలని నిర్ణయించారు.


గ్రామంలో శాంతి భద్రతల కోసం ప్రజలు పోలీసులకు సహకరించాలని అధికారులు కోరారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News