నారాయణఖేడ్ స్థానిక ప్రతినిధి
నారాయణఖేడ్ నియోజకవర్గంలో మానూర్ మండల పరిధిలోని బోరంచ గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఆన్ష్ ఫౌండేషన్ (పుస్తకాలు) ఆధ్వర్యంలో మంగళవారం విద్యార్థులందరికీ నోట్బుక్స్ మరియు విద్యా సామాగ్రి పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి అన్ష్ ఫౌండేషన్ పుస్తకార్ వ్యవస్థాపకురాలు శోభా బన్సాలి,ప్రోగ్రామ్ డైరెక్టర్ శ్రుతి హెడ్గే మరియు రాజేశ్వరి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. పాఠశాల తరపున వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు అశోక్ రావు, ఉపాధ్యాయులు శ్రీధర్, విఠల్, కవిత, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు మహేష్ కుమార్ పాల్గొన్నారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి