Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: February 23, 2026 11:38 PM

బోరంచలో రికార్డు స్థాయి పోలింగ్‌.. ప్రశాంతంగా మూడో విడత ఓటింగ్

బోరంచలో రికార్డు స్థాయి పోలింగ్‌.. ప్రశాంతంగా మూడో విడత ఓటింగ్

బోరంచలో రికార్డు స్థాయి పోలింగ్‌.. ప్రశాంతంగా మూడో విడత ఓటింగ్
December 17, 2025 02:37 PM 265 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
స్థానికం బృందం

బోరంచలో రికార్డు స్థాయి పోలింగ్‌.. ప్రశాంతంగా మూడో విడత ఓటింగ్

స్థానికం ప్రతినిధి

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం మానూర్ మండలం బోరంచ గ్రామంలో మూడో విడత పోలింగ్ ప్రశాంత వాతావరణంలో కొనసాగింది. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికలలో భాగంగా గ్రామంలో ఉత్సాహంగా ఓటర్లు పోలింగ్‌లో పాల్గొన్నారు.

గ్రామంలో మొత్తం 2,123 ఓట్లు ఉండగా, మధ్యాహ్నం 12 గంటల వరకు 1,859 ఓట్లు పోలయ్యాయి. దీంతో పోలింగ్ శాతం 87.56కి చేరి రికార్డు స్థాయిని నమోదు చేసింది. గడువు ముగియడానికి కేవలం అరగంట సమయం మాత్రమే ఉండటంతో అభ్యర్థులు ఇంటింటికీ వెళ్లి ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు తరలించడంలో నిమగ్నమయ్యారు.

ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అధికారులు ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టారు. పోలీసు బందోబస్తు మధ్య పోలింగ్ ప్రక్రియ సజావుగా కొనసాగుతుండటంతో బోరంచ గ్రామంలో ఎన్నికలు ప్రశాంతంగా ముగింపు దశకు చేరుకున్నాయి.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News