బోరంచలో మహిళా సమాఖ్య భవన నిర్మాణానికి తీర్మానం
బోరంచలో మహిళా సమాఖ్య భవన నిర్మాణానికి తీర్మానం
Krishna
గ్రామాభివృద్ధిలో మరో అడుగు: బోరంచలో మహిళా సమాఖ్య భవనం
నారాయణఖేడ్ స్థానిక ప్రతినిధి :నారాయణఖేడ్ నియోజకవర్గం మానూర్ మండల పరిధిలోని బోరంచ గ్రామంలో సోమవారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ కుమార్ షేట్కార్, నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పి. సంజీవ్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.గ్రామ సర్పంచ్ పంచగామ బీరప్ప అధ్యక్షతన, ఉపసర్పంచ్ మొల్ల కరిమ్, గ్రామ వార్డు సభ్యులు సమక్షంలో సమావేశం కొనసాగింది. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ మహిళా సమాఖ్య భవనాలు మంజూరు కావడంతో, బోరంచ గ్రామంలో మహిళా సమాఖ్య భవనం నిర్మాణానికి సంబంధించిన అంశంపై విస్తృతంగా చర్చించారు. అనంతరం గ్రామ అభివృద్ధిలో భాగంగా మహిళా సమాఖ్య భవనం మంజూరుకు గ్రామ పంచాయతీ తరఫున ఏకగ్రీవంగా తీర్మానం చేశారు.చేసిన తీర్మానాన్ని గ్రామ సర్పంచ్ పంచగామ బీరప్ప, ఉపసర్పంచ్ మొల్ల కరిమ్ చేతుల మీదుగా గ్రామ మహిళా సమాఖ్య అధ్యక్షులు సాయమ్మ, సభ్యులు రుక్మిణి, గ్రామ మహిళా సమాఖ్య వీఓఏకు అందజేశారు. ఈ సందర్భంగా మహిళా సాధికారతకు మహిళా సమాఖ్య భవనం ఎంతో ఉపయోగపడుతుందని ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, గ్రామస్థులు తదితరులు పాల్గొని సమావేశాన్ని విజయవంతం చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి