Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 05:58 AM

బోరంచ పాఠశాలలో రామానుజన్‌కు ఘన నివాళులు

బోరంచ పాఠశాలలో రామానుజన్‌కు ఘన నివాళులు

బోరంచ పాఠశాలలో రామానుజన్‌కు ఘన నివాళులు
22-12-2025 49 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

బోరంచ ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా జాతీయ గణిత దినోత్సవం

స్థానిక ప్రతినిధి రామన్నపేట కొండ మల్లేశం గౌడ్

ప్రఖ్యాత గణిత శాస్త్రజ్ఞుడు శ్రీనివాస రామానుజన్ జయంతిని పురస్కరించుకుని సోమవారం మానూర్ మండల పరిధిలోని బోరంచ గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జాతీయ గణిత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

కార్యక్రమం ప్రారంభంలో రామానుజన్ చిత్రపటానికి విద్యార్థులు, ఉపాధ్యాయులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు శివకుమార్ స్వామి, ఉపాధ్యాయ బృందం, గణిత శాస్త్రం బోధిస్తున్న ఉపాధ్యాయులు మహేష్ కుమార్, నర్సప్పలను శాలువాలతో సన్మానించారు.

ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించి, విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. గణితంపై ఆసక్తి పెంపొందించడమే లక్ష్యంగా నిర్వహించిన ఈ కార్యక్రమాలు విద్యార్థుల్లో మంచి ఉత్సాహాన్ని కలిగించాయి.

ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శివకుమార్ స్వామి, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.


Sthanikam

బోరంచ పాఠశాలలో రామానుజన్‌కు ఘన నివాళులు

Article Image

బోరంచ ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా జాతీయ గణిత దినోత్సవం

స్థానిక ప్రతినిధి రామన్నపేట కొండ మల్లేశం గౌడ్

ప్రఖ్యాత గణిత శాస్త్రజ్ఞుడు శ్రీనివాస రామానుజన్ జయంతిని పురస్కరించుకుని సోమవారం మానూర్ మండల పరిధిలోని బోరంచ గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జాతీయ గణిత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

కార్యక్రమం ప్రారంభంలో రామానుజన్ చిత్రపటానికి విద్యార్థులు, ఉపాధ్యాయులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు శివకుమార్ స్వామి, ఉపాధ్యాయ బృందం, గణిత శాస్త్రం బోధిస్తున్న ఉపాధ్యాయులు మహేష్ కుమార్, నర్సప్పలను శాలువాలతో సన్మానించారు.

ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించి, విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. గణితంపై ఆసక్తి పెంపొందించడమే లక్ష్యంగా నిర్వహించిన ఈ కార్యక్రమాలు విద్యార్థుల్లో మంచి ఉత్సాహాన్ని కలిగించాయి.

ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శివకుమార్ స్వామి, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News