Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! బస్టాండ్‌ వద్ద ‘అండర్‌ పాస్‌’ నిర్మించాలి ​- ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి కౌన్సిలర్‌ వినతి ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 07:22 AM

బోరంచ పాఠశాలలో రామానుజన్‌కు ఘన నివాళులు

బోరంచ పాఠశాలలో రామానుజన్‌కు ఘన నివాళులు

బోరంచ పాఠశాలలో రామానుజన్‌కు ఘన నివాళులు
December 22, 2025 06:53 PM 35 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

బోరంచ ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా జాతీయ గణిత దినోత్సవం

స్థానిక ప్రతినిధి రామన్నపేట కొండ మల్లేశం గౌడ్

ప్రఖ్యాత గణిత శాస్త్రజ్ఞుడు శ్రీనివాస రామానుజన్ జయంతిని పురస్కరించుకుని సోమవారం మానూర్ మండల పరిధిలోని బోరంచ గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జాతీయ గణిత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

కార్యక్రమం ప్రారంభంలో రామానుజన్ చిత్రపటానికి విద్యార్థులు, ఉపాధ్యాయులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు శివకుమార్ స్వామి, ఉపాధ్యాయ బృందం, గణిత శాస్త్రం బోధిస్తున్న ఉపాధ్యాయులు మహేష్ కుమార్, నర్సప్పలను శాలువాలతో సన్మానించారు.

ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించి, విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. గణితంపై ఆసక్తి పెంపొందించడమే లక్ష్యంగా నిర్వహించిన ఈ కార్యక్రమాలు విద్యార్థుల్లో మంచి ఉత్సాహాన్ని కలిగించాయి.

ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శివకుమార్ స్వామి, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News