బోరంచ పాఠశాలలో రామానుజన్కు ఘన నివాళులు
బోరంచ పాఠశాలలో రామానుజన్కు ఘన నివాళులు
స్థానికం బృందం
బోరంచ ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా జాతీయ గణిత దినోత్సవం
స్థానిక ప్రతినిధి రామన్నపేట కొండ మల్లేశం గౌడ్
ప్రఖ్యాత గణిత శాస్త్రజ్ఞుడు శ్రీనివాస రామానుజన్ జయంతిని పురస్కరించుకుని సోమవారం మానూర్ మండల పరిధిలోని బోరంచ గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జాతీయ గణిత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
కార్యక్రమం ప్రారంభంలో రామానుజన్ చిత్రపటానికి విద్యార్థులు, ఉపాధ్యాయులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు శివకుమార్ స్వామి, ఉపాధ్యాయ బృందం, గణిత శాస్త్రం బోధిస్తున్న ఉపాధ్యాయులు మహేష్ కుమార్, నర్సప్పలను శాలువాలతో సన్మానించారు.
ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించి, విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. గణితంపై ఆసక్తి పెంపొందించడమే లక్ష్యంగా నిర్వహించిన ఈ కార్యక్రమాలు విద్యార్థుల్లో మంచి ఉత్సాహాన్ని కలిగించాయి.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శివకుమార్ స్వామి, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి