Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 01:28 AM

బోగారంలో రాజకీయ భూకంపం: బీఆర్ఎస్‌లో 300 మంది చేరిక, కాంగ్రెస్‌కు భారీ షాక్

బోగారంలో రాజకీయ భూకంపం: బీఆర్ఎస్‌లో 300 మంది చేరిక, కాంగ్రెస్‌కు భారీ షాక్

బోగారంలో రాజకీయ భూకంపం: బీఆర్ఎస్‌లో 300 మంది చేరిక, కాంగ్రెస్‌కు భారీ షాక్
December 16, 2025 06:15 PM 105 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk


బోగారంలో కాంగ్రెస్‌కు గట్టి షాక్… బీఆర్ఎస్‌లో 300 మంది చేరిక

స్థానికం ప్రతినిధి రామన్నపేట

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం బోగారం గ్రామంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. గ్రామ నూతన సర్పంచ్ కూనూరు సాయి కుమార్ గౌడ్ నాయకత్వంలో సుమారు 300 మంది కాంగ్రెస్ శ్రేణులు మంగళవారం నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సమక్షంలో గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ భారీ చేరికల కార్యక్రమానికి బీఆర్ఎస్ మండల నాయకుడు అంతటి పద్మా రమేశ్ గౌడ్ సారథ్యం వహించారు.

ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకత్వం నుంచి సరైన మద్దతు లభించకపోవడంతో కూనూరు సాయి కుమార్ గౌడ్ బీఆర్ఎస్‌లో చేరి సర్పంచ్‌గా పోటీచేసి భారీ మెజార్టీతో విజయం సాధించిన విషయం తెలిసిందే. చిరుమర్తి లింగయ్యకు ఇచ్చిన మాట ప్రకారం గెలుపు అనంతరం పెద్ద ఎత్తున జనబలంతో మరోసారి కండువా కప్పుకుని తన రాజకీయ బలాన్ని నిరూపించుకున్నారు.

ఈ సందర్భంగా చిరుమర్తి లింగయ్య శాలువాలతో సర్పంచ్ సాయి కుమార్ గౌడ్‌తో పాటు ఉప సర్పంచ్ బైకాని ఉమా మహేశ్, వార్డ్ మెంబర్లు గోగు ప్రమీల రమేశ్, మేడి ఆంజనేయులు, నేరడి మానస సురేశ్, కడారి పావని పాపయ్య, వనం అండాలు యాదగిరిలను ఘనంగా సన్మానించారు.

కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల నాయకులు బద్దుల ఉమా రమేశ్ యాదవ్‌తో పాటు పలువురు సీనియర్ నాయకులు పాల్గొన్నారు. బోగారంలో జరిగిన ఈ భారీ చేరికలు కాంగ్రెస్ శిబిరానికి గట్టి ఎదురుదెబ్బగా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News