Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గుడి బండలా మారిన గ్యాస్ బండి… క్యూలో నిల్చొని అలసిపోయిన వినియోగదారులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 11:48 AM

బోగారంలో రాజకీయ భూకంపం: బీఆర్ఎస్‌లో 300 మంది చేరిక, కాంగ్రెస్‌కు భారీ షాక్

బోగారంలో రాజకీయ భూకంపం: బీఆర్ఎస్‌లో 300 మంది చేరిక, కాంగ్రెస్‌కు భారీ షాక్

బోగారంలో రాజకీయ భూకంపం: బీఆర్ఎస్‌లో 300 మంది చేరిక, కాంగ్రెస్‌కు భారీ షాక్
December 16, 2025 06:15 PM 94 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk


బోగారంలో కాంగ్రెస్‌కు గట్టి షాక్… బీఆర్ఎస్‌లో 300 మంది చేరిక

స్థానికం ప్రతినిధి రామన్నపేట

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం బోగారం గ్రామంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. గ్రామ నూతన సర్పంచ్ కూనూరు సాయి కుమార్ గౌడ్ నాయకత్వంలో సుమారు 300 మంది కాంగ్రెస్ శ్రేణులు మంగళవారం నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సమక్షంలో గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ భారీ చేరికల కార్యక్రమానికి బీఆర్ఎస్ మండల నాయకుడు అంతటి పద్మా రమేశ్ గౌడ్ సారథ్యం వహించారు.

ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకత్వం నుంచి సరైన మద్దతు లభించకపోవడంతో కూనూరు సాయి కుమార్ గౌడ్ బీఆర్ఎస్‌లో చేరి సర్పంచ్‌గా పోటీచేసి భారీ మెజార్టీతో విజయం సాధించిన విషయం తెలిసిందే. చిరుమర్తి లింగయ్యకు ఇచ్చిన మాట ప్రకారం గెలుపు అనంతరం పెద్ద ఎత్తున జనబలంతో మరోసారి కండువా కప్పుకుని తన రాజకీయ బలాన్ని నిరూపించుకున్నారు.

ఈ సందర్భంగా చిరుమర్తి లింగయ్య శాలువాలతో సర్పంచ్ సాయి కుమార్ గౌడ్‌తో పాటు ఉప సర్పంచ్ బైకాని ఉమా మహేశ్, వార్డ్ మెంబర్లు గోగు ప్రమీల రమేశ్, మేడి ఆంజనేయులు, నేరడి మానస సురేశ్, కడారి పావని పాపయ్య, వనం అండాలు యాదగిరిలను ఘనంగా సన్మానించారు.

కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల నాయకులు బద్దుల ఉమా రమేశ్ యాదవ్‌తో పాటు పలువురు సీనియర్ నాయకులు పాల్గొన్నారు. బోగారంలో జరిగిన ఈ భారీ చేరికలు కాంగ్రెస్ శిబిరానికి గట్టి ఎదురుదెబ్బగా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News