Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 06:10 AM

బోగారం అభివృద్ధే లక్ష్యం… సమస్యలపై ఫోకస్ పెట్టిన సర్పంచ్ సాయికుమార్

బోగారం అభివృద్ధే లక్ష్యం… సమస్యలపై ఫోకస్ పెట్టిన సర్పంచ్ సాయికుమార్

బోగారం అభివృద్ధే లక్ష్యం… సమస్యలపై ఫోకస్ పెట్టిన సర్పంచ్ సాయికుమార్
December 31, 2025 11:43 AM 218 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ప్రజల దగ్గరకే పాలన… వార్డులలో సమస్యలు పరిశీలించిన సర్పంచ్ సాయికుమార్

గ్రామంలో వార్డుల సమస్యలపై క్షేత్రస్థాయి పరిశీలన

రామన్నపేట స్థానిక ప్రతినిధి

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం బోగారం గ్రామంలో నూతనంగా బాధ్యతలు చేపట్టిన సర్పంచ్ సాయికుమార్ గౌడ్ గ్రామంలోని పలు వార్డులలో పర్యటించి స్థానిక సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రజల నుంచి నేరుగా వినిపించిన అంశాల్లో కొన్ని సమస్యలను తక్షణమే పరిష్కరించడంతో గ్రామస్తుల్లో సానుకూల స్పందన కనిపించింది.

ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామాభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని, వార్డులలో ఉన్న ప్రతి సమస్యను వార్డు మెంబర్లు లేదా గ్రామస్తులు తన దృష్టికి తీసుకురావాలని కోరారు. సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యతనిచ్చి దశలవారీగా అభివృద్ధి పనులు చేపడతామని తెలిపారు. గ్రామ అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజల సహకారం ఎల్లవేళలా అవసరమని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ బైకాని ఉమా మహేష్‌తో పాటు వార్డు మెంబర్లు గోగు ప్రమీల రమేష్, కనుకు మల్లేశం, మేడి ఆంజనేయులు దేవి, నేరటిమానస సురేష్ పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News