Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
“ఈ సమస్య పరిష్కరించేది ఎప్పుడో...?” “తాత్కాలికం కాదు… శాశ్వత పరిష్కారం సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 08:26 AM

బోగారం అభివృద్ధే లక్ష్యం… సమస్యలపై ఫోకస్ పెట్టిన సర్పంచ్ సాయికుమార్

బోగారం అభివృద్ధే లక్ష్యం… సమస్యలపై ఫోకస్ పెట్టిన సర్పంచ్ సాయికుమార్

బోగారం అభివృద్ధే లక్ష్యం… సమస్యలపై ఫోకస్ పెట్టిన సర్పంచ్ సాయికుమార్
December 31, 2025 11:43 AM 209 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ప్రజల దగ్గరకే పాలన… వార్డులలో సమస్యలు పరిశీలించిన సర్పంచ్ సాయికుమార్

గ్రామంలో వార్డుల సమస్యలపై క్షేత్రస్థాయి పరిశీలన

రామన్నపేట స్థానిక ప్రతినిధి

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం బోగారం గ్రామంలో నూతనంగా బాధ్యతలు చేపట్టిన సర్పంచ్ సాయికుమార్ గౌడ్ గ్రామంలోని పలు వార్డులలో పర్యటించి స్థానిక సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రజల నుంచి నేరుగా వినిపించిన అంశాల్లో కొన్ని సమస్యలను తక్షణమే పరిష్కరించడంతో గ్రామస్తుల్లో సానుకూల స్పందన కనిపించింది.

ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామాభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని, వార్డులలో ఉన్న ప్రతి సమస్యను వార్డు మెంబర్లు లేదా గ్రామస్తులు తన దృష్టికి తీసుకురావాలని కోరారు. సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యతనిచ్చి దశలవారీగా అభివృద్ధి పనులు చేపడతామని తెలిపారు. గ్రామ అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజల సహకారం ఎల్లవేళలా అవసరమని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ బైకాని ఉమా మహేష్‌తో పాటు వార్డు మెంబర్లు గోగు ప్రమీల రమేష్, కనుకు మల్లేశం, మేడి ఆంజనేయులు దేవి, నేరటిమానస సురేష్ పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News