ప్రజల దగ్గరకే పాలన… వార్డులలో సమస్యలు పరిశీలించిన సర్పంచ్ సాయికుమార్
గ్రామంలో వార్డుల సమస్యలపై క్షేత్రస్థాయి పరిశీలన
రామన్నపేట స్థానిక ప్రతినిధి
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం బోగారం గ్రామంలో నూతనంగా బాధ్యతలు చేపట్టిన సర్పంచ్ సాయికుమార్ గౌడ్ గ్రామంలోని పలు వార్డులలో పర్యటించి స్థానిక సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రజల నుంచి నేరుగా వినిపించిన అంశాల్లో కొన్ని సమస్యలను తక్షణమే పరిష్కరించడంతో గ్రామస్తుల్లో సానుకూల స్పందన కనిపించింది.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామాభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని, వార్డులలో ఉన్న ప్రతి సమస్యను వార్డు మెంబర్లు లేదా గ్రామస్తులు తన దృష్టికి తీసుకురావాలని కోరారు. సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యతనిచ్చి దశలవారీగా అభివృద్ధి పనులు చేపడతామని తెలిపారు. గ్రామ అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజల సహకారం ఎల్లవేళలా అవసరమని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ బైకాని ఉమా మహేష్తో పాటు వార్డు మెంబర్లు గోగు ప్రమీల రమేష్, కనుకు మల్లేశం, మేడి ఆంజనేయులు దేవి, నేరటిమానస సురేష్ పాల్గొన్నారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి