PRINT TIME: April 11, 2026 03:19 PM
బలివే మహాశివరాత్రి ఉత్సవాలపై సమీక్ష జరిపిన మంత్రి కొలుసు పార్థసారథి, ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి
బలివే మహాశివరాత్రి ఉత్సవాలపై సమీక్ష జరిపిన మంత్రి కొలుసు పార్థసారథి, ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి
February 14, 2026 08:32 AM
36 Views
స్థానికం ప్రతినిధి :
ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం ముసునూరుమండలం శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం వద్ద మహాశివరాత్రి ఉత్సవాలు విజయవంతంగా నిర్వహించేందుకు అధికారులు సమన్వయంతో పని చేయాలని రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి ఆదేశించారు. భక్తులకు సౌకర్యాలు, శాంతి భద్రతలు, ట్రాఫిక్ నియంత్రణ, తాగునీరు, వైద్య సేవలు, పారిశుధ్యం వంటి అన్ని ఏర్పాట్లు పక్కాగా చేయాలని సూచించారు. ఆలయ పునర్నిర్మాణానికి రూ.2.50 కోట్లు మంజూరు చేసినట్లు, అవసరమైతే మరిన్ని నిధులు ఇస్తామని తెలిపారు. ఉత్సవాల అనంతరం నిర్మాణ పనులు ప్రారంభిస్తామని చెప్పారు. జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి కూడా భక్తుల రద్దీకి అనుగుణంగా భద్రత, సీసీ కెమెరాలు, డ్రోన్లు, ఆర్టీసీ బస్సులు తదితర ఏర్పాట్లు చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి