బాలిక రక్షణను గాలికొదిలేశారు. బండి భగీరథ్ను వెంటనే అరెస్ట్ చేయాలి: బీఆర్ఎస్ నేత స్వాతి
బాలిక రక్షణను గాలికొదిలేశారు. బండి భగీరథ్ను వెంటనే అరెస్ట్ చేయాలి: బీఆర్ఎస్ నేత స్వాతి
Editor Desk
యాదాద్రి భువనగిరి: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్కు సంబంధించిన కేసులో బాధిత బాలికకు న్యాయం చేయడంలో ప్రభుత్వం విఫలమైందని బీఆర్ఎస్ పార్టీ యాదగిరిగుట్ట మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కళ్ళెం స్వాతి ఆరోపించారు.
మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో ఆమె మాట్లాడుతూ.. ప్రధాని మోదీ పర్యటనపై చూపుతున్న శ్రద్ధను బాధిత కుటుంబానికి న్యాయం చేయడంలో ప్రభుత్వం చూపడం లేదని విమర్శించారు. పోక్సో కేసుల్లో సాధారణంగా 24 గంటల్లోనే నిందితులను అరెస్ట్ చేస్తారని, అయితే భగీరథ్ విషయంలో మూడు, నాలుగు రోజులు గడిచినా చర్యలు తీసుకోకపోవడం ఎందుకని ప్రశ్నించారు.
సామాన్యులకు ఒక చట్టం, కేంద్ర మంత్రుల కుటుంబ సభ్యులకు మరో చట్టమా అని నిలదీశారు. ఈ అంశంపై సీఎం రేవంత్రెడ్డి, మంత్రులు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. కేంద్ర మంత్రి కుమారుడు కావడం వల్లే చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు.
బాధిత బాలికకు న్యాయం జరిగేలా వెంటనే బండి భగీరథ్ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే కేంద్ర మంత్రి బండి సంజయ్ తన నిజాయితీని నిరూపించుకోవాలంటే కేంద్ర మంత్రి పదవితో పాటు ఎంపీ స్థానానికి రాజీనామా చేయాలని కోరారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి