Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 02:17 AM

బాలిక రక్షణను గాలికొదిలేశారు. బండి భగీరథ్‌ను వెంటనే అరెస్ట్‌ చేయాలి: బీఆర్‌ఎస్‌ నేత స్వాతి

బాలిక రక్షణను గాలికొదిలేశారు. బండి భగీరథ్‌ను వెంటనే అరెస్ట్‌ చేయాలి: బీఆర్‌ఎస్‌ నేత స్వాతి

బాలిక రక్షణను గాలికొదిలేశారు. బండి భగీరథ్‌ను వెంటనే అరెస్ట్‌ చేయాలి: బీఆర్‌ఎస్‌ నేత స్వాతి
13-05-2026 38 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ కుమారుడు బండి భగీరథ్‌కు సంబంధించిన కేసులో బాధిత బాలికకు న్యాయం చేయడంలో ప్రభుత్వం విఫలమైందని బీఆర్‌ఎస్‌ పార్టీ యాదగిరిగుట్ట మహిళా విభాగం వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కళ్ళెం స్వాతి ఆరోపించారు.

మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో ఆమె మాట్లాడుతూ.. ప్రధాని మోదీ పర్యటనపై చూపుతున్న శ్రద్ధను బాధిత కుటుంబానికి న్యాయం చేయడంలో ప్రభుత్వం చూపడం లేదని విమర్శించారు. పోక్సో కేసుల్లో సాధారణంగా 24 గంటల్లోనే నిందితులను అరెస్ట్‌ చేస్తారని, అయితే భగీరథ్‌ విషయంలో మూడు, నాలుగు రోజులు గడిచినా చర్యలు తీసుకోకపోవడం ఎందుకని ప్రశ్నించారు.

సామాన్యులకు ఒక చట్టం, కేంద్ర మంత్రుల కుటుంబ సభ్యులకు మరో చట్టమా అని నిలదీశారు. ఈ అంశంపై సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. కేంద్ర మంత్రి కుమారుడు కావడం వల్లే చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు.

బాధిత బాలికకు న్యాయం జరిగేలా వెంటనే బండి భగీరథ్‌ను అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. అలాగే కేంద్ర మంత్రి బండి సంజయ్‌ తన నిజాయితీని నిరూపించుకోవాలంటే కేంద్ర మంత్రి పదవితో పాటు ఎంపీ స్థానానికి రాజీనామా చేయాలని కోరారు.

Sthanikam

బాలిక రక్షణను గాలికొదిలేశారు. బండి భగీరథ్‌ను వెంటనే అరెస్ట్‌ చేయాలి: బీఆర్‌ఎస్‌ నేత స్వాతి

Article Image

యాదాద్రి భువనగిరి: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ కుమారుడు బండి భగీరథ్‌కు సంబంధించిన కేసులో బాధిత బాలికకు న్యాయం చేయడంలో ప్రభుత్వం విఫలమైందని బీఆర్‌ఎస్‌ పార్టీ యాదగిరిగుట్ట మహిళా విభాగం వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కళ్ళెం స్వాతి ఆరోపించారు.

మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో ఆమె మాట్లాడుతూ.. ప్రధాని మోదీ పర్యటనపై చూపుతున్న శ్రద్ధను బాధిత కుటుంబానికి న్యాయం చేయడంలో ప్రభుత్వం చూపడం లేదని విమర్శించారు. పోక్సో కేసుల్లో సాధారణంగా 24 గంటల్లోనే నిందితులను అరెస్ట్‌ చేస్తారని, అయితే భగీరథ్‌ విషయంలో మూడు, నాలుగు రోజులు గడిచినా చర్యలు తీసుకోకపోవడం ఎందుకని ప్రశ్నించారు.

సామాన్యులకు ఒక చట్టం, కేంద్ర మంత్రుల కుటుంబ సభ్యులకు మరో చట్టమా అని నిలదీశారు. ఈ అంశంపై సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. కేంద్ర మంత్రి కుమారుడు కావడం వల్లే చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు.

బాధిత బాలికకు న్యాయం జరిగేలా వెంటనే బండి భగీరథ్‌ను అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. అలాగే కేంద్ర మంత్రి బండి సంజయ్‌ తన నిజాయితీని నిరూపించుకోవాలంటే కేంద్ర మంత్రి పదవితో పాటు ఎంపీ స్థానానికి రాజీనామా చేయాలని కోరారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News