Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
వెల్లంకిలో ఘనంగా హనుమాన్‌ జయంతోత్సవం పూర్ణాహుతిలో పాల్గొన్న సర్పంచ్ ఈడెం రాధా శ్రీనివాస్ డిజిటల్‌ సభ్యత్వ నమోదుకు బీఆర్‌ఎస్‌ శ్రీకారం. ఎర్రవెల్లిలో కేసీఆర్‌తో కీలక సమావేశం సీఎం పర్యటనపై భద్రత ఏర్పాట్లు పరిశీలిస్తున్న సత్యసాయి జిల్లా అధికారులు వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. సోమందేపల్లి పోలీసులకు డే డ్రోన్ & నైట్ విజన్ డ్రోన్‌లపై ప్రత్యేక శిక్షణ ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 13, 2026 08:27 AM

బాలిక రక్షణను గాలికొదిలేశారు. బండి భగీరథ్‌ను వెంటనే అరెస్ట్‌ చేయాలి: బీఆర్‌ఎస్‌ నేత స్వాతి

బాలిక రక్షణను గాలికొదిలేశారు. బండి భగీరథ్‌ను వెంటనే అరెస్ట్‌ చేయాలి: బీఆర్‌ఎస్‌ నేత స్వాతి

బాలిక రక్షణను గాలికొదిలేశారు. బండి భగీరథ్‌ను వెంటనే అరెస్ట్‌ చేయాలి: బీఆర్‌ఎస్‌ నేత స్వాతి
May 13, 2026 06:17 AM 15 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ కుమారుడు బండి భగీరథ్‌కు సంబంధించిన కేసులో బాధిత బాలికకు న్యాయం చేయడంలో ప్రభుత్వం విఫలమైందని బీఆర్‌ఎస్‌ పార్టీ యాదగిరిగుట్ట మహిళా విభాగం వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కళ్ళెం స్వాతి ఆరోపించారు.

మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో ఆమె మాట్లాడుతూ.. ప్రధాని మోదీ పర్యటనపై చూపుతున్న శ్రద్ధను బాధిత కుటుంబానికి న్యాయం చేయడంలో ప్రభుత్వం చూపడం లేదని విమర్శించారు. పోక్సో కేసుల్లో సాధారణంగా 24 గంటల్లోనే నిందితులను అరెస్ట్‌ చేస్తారని, అయితే భగీరథ్‌ విషయంలో మూడు, నాలుగు రోజులు గడిచినా చర్యలు తీసుకోకపోవడం ఎందుకని ప్రశ్నించారు.

సామాన్యులకు ఒక చట్టం, కేంద్ర మంత్రుల కుటుంబ సభ్యులకు మరో చట్టమా అని నిలదీశారు. ఈ అంశంపై సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. కేంద్ర మంత్రి కుమారుడు కావడం వల్లే చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు.

బాధిత బాలికకు న్యాయం జరిగేలా వెంటనే బండి భగీరథ్‌ను అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. అలాగే కేంద్ర మంత్రి బండి సంజయ్‌ తన నిజాయితీని నిరూపించుకోవాలంటే కేంద్ర మంత్రి పదవితో పాటు ఎంపీ స్థానానికి రాజీనామా చేయాలని కోరారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News