బాల్యమిత్రునికి అండగా పూర్వ విద్యార్థులు
బాల్యమిత్రునికి అండగా పూర్వ విద్యార్థులు
K.RAVI
స్నేహితుడి తల్లి మృతి పట్ల ప్రగాఢ సానుభూతి
రూ.16,000 ఆర్థిక సహాయం అందజేత
చౌటుప్పల్ మండలం నేలపట్ల గ్రామంలో 1998-99 బ్యాచ్కు చెందిన పదవ తరగతి పూర్వ విద్యార్థులు తమ బాల్యమిత్రుడు గంగాపురం ఉపేందర్ తల్లి మృతి పట్ల ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఉపేందర్ నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అలాగే స్నేహబంధాన్ని చాటుతూ రూ.16,000 ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా స్నేహితులు మాట్లాడుతూ కష్టకాలంలో ఒకరికి ఒకరు అండగా నిలవడం స్నేహబంధం గొప్పతనమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో గుర్రం ప్రమోద్ కుమార్, డిల్లీ సురేందర్ రెడ్డి, గంగాపురం నగేశ్, పిండి రమేష్, కత్తుల రవి, ముత్యాలు, ఎస్. యాదగిరి, ఎం. శ్రీనివాస్, బూడిద అశోక్, మేడి శ్రీనివాస్, రవ్వ రవీందర్, కోడెం విజయ్ కుమార్, తడక జ్యోతి, హేమలత, కవిత, సుగుణ తదితర పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి