బాలల హక్కులకు భంగం కలిగించే మీ ప్రవచనాలు మానుకోవాలి
బాలల హక్కులకు భంగం కలిగించే మీ ప్రవచనాలు మానుకోవాలి
Sthanikam District Staff Reporter
రాజ్యాంగం ప్రకారం లభించిన హక్కులను విమర్శిస్తే దేశ ద్రోహమే
-బాలల హక్కుల సంఘం కొడారి వెంకటేష్
"అన్నంలో గుడ్డు పెట్టడం ఏంటండీ! చదువుతే చదవమనండి,లేకపోతే వెళ్ళి పొమ్మని చెప్పండి!" అని ప్రవచనాలు పలికిన గరికపాటి నరసింహారావు,తన వ్యాఖ్యలను వెంటనే ఉపసంరించుకోవాలని బాలల హక్కుల సంఘం నాయకులు కొడారి వెంకటేష్ డిమాండ్ చేశారు.శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. భారత రాజ్యాంగం,సుప్రీంకోర్టు ఆదేశానుసారం దేశంలోని బాలబాలికలు అందించే పౌష్టికాహారం,ఏకరూప దుస్తులు, ఉచిత పుస్తకాలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన గరికపాటి నరసింహారావు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.భారత రాజ్యాంగం ఆర్టికల్ 21(రైట్ టు లైఫ్) ప్రకారం మనదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు చెప్పిన ప్రకారం జీవించడం అంటే కేవలం బతకడం కాదు.గౌరవంగా బతకడం,ఆరోగ్యం,పోషకాహారం,కనీస జీవన ప్రమాణాలు అందులో ఇమిడి ఉన్నాయని గ్రహించాలని ఆయన అన్నారు.అంటే ప్రభుత్వం జనాలకు రేషన్ ఇవ్వడం,పిల్లలకు పౌష్టికాహారం అందించడం దానమో,దయో కాదు,రాజ్యాంగం కల్పించిన హక్కు ఆరోగ్యంగా జీవించడానికి అనువైన హక్కు 2001లో సుప్రీంకోర్టు ఒక కీలకమైన ఆదేశం ఇచ్చింది. పిల్లలకు డ్రై రేషన్ కాదు వారికి వండిన భోజనం ఇవ్వాలని తీర్పు ఇచ్చింది.దీంతోనే "మధ్యాహ్న భోజనం పథకం"(మిడ్ డే మీల్స్) అమల్లోకి వచ్చిందని ఆయన అన్నారు.పిల్లలందరికీ పౌష్టికాహారం అందించాలని ప్రభుత్వాలను ఆదేశించింది.దేశంలోని 146 కోట్ల జనాభాలో 12 శాతం జనాభా పోషకాహారం లోపంతో బాధపడుతున్నారని లెక్కలు చెబుతున్నాయి.దేశంలోని సుమారు యాభై కోట్ల మంది పిల్లల్లో 32.9 శాతం మంది పిల్లలు వయసుకు తగిన ఎత్తు ఎదగక పోవడానికి,18.7 శాతం మంది పిల్లలు వయసుకు తగిన బరువు లేకపోవడానికి ప్రధాన కారణం పోషకాహారం తీసుకోకపోవడమే అని నిపుణులు సూచిస్తున్నారని ఆయన అన్నారు. భారత ప్రభుత్వం ఆకలి వల్ల ఎవ్వరూ కూడా చనిపోవడం లేదని చెబుతున్నారు. ఆకలి వల్ల ఎవ్వరూ చనిపోవడం లేదు.వాస్తవమే కానీ చనిపోయే వారంతా ఆకలి వల్ల వచ్చిన జబ్బుల వల్ల అని (గుర్తించడం)తెలుసుకోవడం మన విజ్ఞత కు నిదర్శనమని ఆయన అన్నారు.గరికపాటి వారు పిల్లల హక్కులపై మాట్లాడే ముందు పిల్లల హక్కులకు భంగం కలిగించే వారి గురించి మాట్లాడితే బాగుండేది. పిల్లల పౌష్టికాహార విషయంలో చేసే స్కాముల గురించి,పిల్లల నోటి కాడి ముద్దను మిగుల్చుకునే కమీషన్ దారుల గురించి మాట్లాడితే బాగుండేదని ఆయన అన్నారు.తమరు ప్రభుత్వ ఖజానాలో డబ్బు లేదని, ప్రభుత్వ ఏజెంటుగా చెబుతున్నారు సంతోషం. కానీ వందల,వేల కోట్ల రూపాయలు పొలిటీషియన్ ల ఆస్తులుగా ఎలా మారుతుందో మీరు సమాధానం చెబుతారా? అని గరికపాటిని ఆయన ప్రశ్నించారు. మనిషిగా బతుకుతున్నందుకైనా కనీసం పిల్లల మీదైనా కాస్తా బాధ్యతతో మాట్లాడాలని ఆయన హితవు పలికారు.నేటి బాలలే రేపటి పౌరులని పిల్లలే మన జాతి సంపద అని గుర్తించాలని ఆయన అన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి