బాలాజీ హై స్కూల్ లో నూతన అక్షర అభ్యాసం కార్యక్రమం
బాలాజీ హై స్కూల్ లో నూతన అక్షర అభ్యాసం కార్యక్రమం
Prabhakar
స్థానికం ప్రతినిధి మల్కాజిగిరి పి ప్రభాకర్
జిహెచ్ఎంసి మల్కాజ్గిరి సర్కిల్ పరిధిలోని బాలాజీ హైస్కూల్లో ప్రధాన ఉపాధ్యాయురాలు శ్రీమతి కె.వి మృణాళిని ఆధ్వర్యంలో ఘనంగా నూతన అక్షర అభ్యాస కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బాలాజీ హైస్కూల్లో చదువుల తల్లి సరస్వతి దేవి ఫోటో కి ఘనంగా పూలమాల లేసి నూతనంగా చేరిన విద్యార్థులకు అక్షర అభ్యాసన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నూతనంగా చేరిన విద్యార్థులకు అక్షరాభ్యాసం నేర్పించారు విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నంత శిఖరాలకు ఎదగాలని ఈ సందర్భంగా తెలియజేశారు. విద్యార్థులు ఉపాధ్యాయులు అందరూ పాల్గొని సరస్వతి దేవి పూజలో పాల్గొని నూతన అక్షరాభ్యాస కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఈ కార్యక్రమంలో స్కూల్ చైర్మన్ టి డి శ్రీనివాసన్, ప్రధాన ఉపాధ్యాయురాలు కె.వి మృణాళిని, జనరల్ సెక్రెటరీ టిడి స్వప్న, కరస్పాండెంట్ టి డి సందీప్ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి