బాక్సింగ్ టోర్నమెంట్లో విజేతలకు మెడల్స్ అందజేసిన రాజ్కుమార్ రెడ్డి
బాక్సింగ్ టోర్నమెంట్లో విజేతలకు మెడల్స్ అందజేసిన రాజ్కుమార్ రెడ్డి
Editor Desk
హైదరాబాద్, నగరంలోని శ్రీ హనుమాన్ వ్యాయంశాల హైస్కూల్ గ్రౌండ్లో ఆదివారం హెచ్వీఎస్ కాంబాట్ స్పోర్ట్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన 2వ ఓపెన్ కిక్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ ఉత్సాహంగా జరిగింది. ఈ కార్యక్రమానికి భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె. రాజ్కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పోటీలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు కూడా సమానంగా అవసరమన్నారు. క్రీడల ద్వారా శారీరక దారుఢ్యంతో పాటు మానసిక ఉల్లాసం పెరుగుతుందని పేర్కొన్నారు. యువత క్రీడల పట్ల ఆసక్తి పెంపొందించుకోవాలని సూచించారు.
పోటీలను విజయవంతంగా నిర్వహించిన నిర్వాహకులను ఆయన అభినందించారు. అనంతరం విజేతలకు మెడల్స్, ప్రశంసాపత్రాలు అందజేశారు. భవిష్యత్తులో ఇలాంటి క్రీడా పోటీల నిర్వహణకు తన వంతు ఆర్థిక సహాయం అందించేందుకు ముందుంటానని రాజ్కుమార్ రెడ్డి తెలిపారు.
ఈ కార్యక్రమంలో క్రీడాకారులు, నిర్వాహకులు, తల్లిదండ్రులు, క్రీడాభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి