Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గుడి బండలా మారిన గ్యాస్ బండి… క్యూలో నిల్చొని అలసిపోయిన వినియోగదారులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 10:45 AM

బైరామాల్ గూడ ఫ్లైఓవర్‌కు మహాత్మా జ్యోతిబాపూలే పేరు పెట్టాలి: తెలంగాణ రాజ్యాధికార పార్టీ

బైరామాల్ గూడ ఫ్లైఓవర్‌కు మహాత్మా జ్యోతిబాపూలే పేరు పెట్టాలి: తెలంగాణ రాజ్యాధికార పార్టీ

బైరామాల్ గూడ ఫ్లైఓవర్‌కు మహాత్మా జ్యోతిబాపూలే పేరు పెట్టాలి: తెలంగాణ రాజ్యాధికార పార్టీ
February 14, 2026 01:54 PM 50 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

: ఎల్బీనగర్ పరిధిలోని బైరామాల్ గూడ పైవంతెనకు మహాత్మా జ్యోతిరావు పూలే పేరు పెట్టాలని తెలంగాణ రాజ్యాధికార సంఘం ప్రభుత్వాన్ని కోరింది. సంఘం ఎల్బీనగర్ నియోజకవర్గ బాధ్యులు బొంగు వెంకటేష్ గౌడ్, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి ఈ సందర్భంగా మాట్లాడారు.

సమాజ సంస్కర్తలైన మహాత్మా జ్యోతిరావు ఫూలే మరియు సావిత్రిబాయ్ ఫూలే లు విద్య ద్వారానే సమాజంలో శాశ్వత మార్పు సాధ్యమని శతాబ్దం క్రితమే బోధించారని పేర్కొన్నారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి జీవితాంతం పోరాడిన మహనీయుడైన జ్యోతిరావు పూలేకు భారతరత్న ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ప్రజా నిర్మాణాలకు పేర్లు నిర్ణయించే విషయంలో వ్యక్తిగత ప్రయోజనాలు కాకుండా సమాజానికి సేవచేసిన మహనీయుల సేవలను పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. ఎలాంటి త్యాగం లేకుండా కొందరు తమ స్వార్థ ప్రయోజనాల కోసం పేర్లు ప్రతిపాదించడం సముచితం కాదని హితవు పలికారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాభవన్‌కు మహాత్మా జ్యోతిరావు పూలే పేరు పెట్టిన విషయాన్ని గుర్తుచేస్తూ, ఎల్బీనగర్ ప్రాంతంలో వెనుకబడిన వర్గాల ప్రజలు అధికంగా ఉన్నందున బైరామాల్ గూడ పైవంతెనకు కూడా పూలే పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే ఎల్బీనగర్ ప్రాంతంలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ రాజ్యాధికార సంఘం యువజన విభాగం అధ్యక్షుడు బొడ్డుపల్లి చంద్రశేఖర్, హైదరాబాద్ బాధ్యులు బావన, మేడ్చల్–మల్కాజిగిరి యువజన విభాగం అధ్యక్షుడు, రంగారెడ్డి జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు పాకాల నరసింహ, సింగం అరుణ్, ఎన్‌టీఆర్ నగర్ విభాగం అధ్యక్షుడు సంపత్ ప్రసాద్, కొత్తపేట విభాగం అధ్యక్షుడు స్వామి ముదిరాజ్, నారాయణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News