PRINT TIME: April 11, 2026 03:10 PM
బైక్ ప్రమాదంలో గాయపడిన యువకుడిని పరామర్శించిన:జీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్
బైక్ ప్రమాదంలో గాయపడిన యువకుడిని పరామర్శించిన:జీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్
February 20, 2026 04:59 PM
17 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Krishna
నారాయణఖేడ్ నియోజకవర్గంలో సిర్గాపూర్ మండలం పరిధిలోని పెద్ద ముబారక్పూర్ గ్రామానికి చెందిన ఉపసర్పంచ్ అసంరాములు కుమారుడు కార్తీక్ ఇటీవల జరిగిన బైక్ ప్రమాదంలో గాయపడిన విషయం తెలిసి, వారి నివాసానికి వెళ్లి పరామర్శించారు.కార్తీక్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా జీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ నాయకుడు గుర్రపు మచ్చేందర్ మాట్లాడుతూ, కార్తీక్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అవసరమైన సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు.ఈ పరామర్శ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా సాగర సంగం గౌరవ అధ్యక్షుడు కృష్ణాపూర్ మాజీ ఎంపీటీసీ అంజయ్య సాగర్, నాయకుడు లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.స్థానిక ప్రజలు ఈ పరామర్శను అభినందించారు. కార్తీక్ త్వరగా కోలుకొని సాధారణ జీవితంలోకి రావాలని గ్రామస్తులు ఆకాంక్షించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి