బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించండి
బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించండి
Editor Desk
మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
స్థానిక ప్రతినిధి - కొండ మల్లేశం గౌడ్
మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల ఎన్నికలలో గ్రామ సర్పంచులుగా, వార్డు సభ్యులుగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను, బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని స్థానిక మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కోరారు. ఆదివారం మండల కేంద్రంలో ఆయన ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ చేసిన అభివృద్ధే ఈ మండలంలో కనిపిస్తుందని, రెండు సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని ఆయన ఆరోపించారు. ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీని ప్రజలు తిప్పి కొట్టాల్సిన సమయం ఇదేనని ఆయన తెలిపారు. రామన్నపేట మేజర్ గ్రామపంచాయతీ బిఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి మిర్యాల మల్లేష్ బ్యాట్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. బిఆర్ఎస్, సీపీఐ(ఎం) పార్టీ బలపర్చిన వార్డు సభ్యులను గెలిపించాలనిఆయన కోరారు. ఆయన వెంట సర్పంచ్ అభ్యర్థి మిర్యాల మల్లేష్, మాజీ ఎంపిటిసి లు గొరిగే నరసింహ, వేమవరం సుధీర్ బాబు, నాయకులు బందెల రాములు, పోతరాజు సాయికుమార్, సీపీఐ(ఎం) నాయకులు కందుల హనుమంతు, భావన్లపల్లి బాలరాజు, గోరిగే సోములు, తదితరులున్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి