Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! బస్టాండ్‌ వద్ద ‘అండర్‌ పాస్‌’ నిర్మించాలి ​- ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి కౌన్సిలర్‌ వినతి ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 07:43 AM

బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించండి

బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించండి

బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించండి
December 08, 2025 05:19 AM 179 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk


మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య

స్థానిక ప్రతినిధి - కొండ మల్లేశం గౌడ్

మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల ఎన్నికలలో గ్రామ సర్పంచులుగా, వార్డు సభ్యులుగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను, బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని స్థానిక మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కోరారు. ఆదివారం మండల కేంద్రంలో ఆయన ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ చేసిన అభివృద్ధే ఈ మండలంలో కనిపిస్తుందని, రెండు సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని ఆయన ఆరోపించారు. ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీని ప్రజలు తిప్పి కొట్టాల్సిన సమయం ఇదేనని ఆయన తెలిపారు. రామన్నపేట మేజర్ గ్రామపంచాయతీ బిఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి మిర్యాల మల్లేష్ బ్యాట్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. బిఆర్ఎస్, సీపీఐ(ఎం) పార్టీ బలపర్చిన వార్డు సభ్యులను గెలిపించాలనిఆయన కోరారు. ఆయన వెంట సర్పంచ్ అభ్యర్థి మిర్యాల మల్లేష్, మాజీ ఎంపిటిసి లు గొరిగే నరసింహ, వేమవరం సుధీర్ బాబు, నాయకులు బందెల రాములు, పోతరాజు సాయికుమార్, సీపీఐ(ఎం) నాయకులు కందుల హనుమంతు, భావన్లపల్లి బాలరాజు, గోరిగే సోములు, తదితరులున్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News