బిఆర్ఎస్ విజయమే ప్రజల ఆశయానికి నిదర్శనం: మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
బిఆర్ఎస్ విజయమే ప్రజల ఆశయానికి నిదర్శనం: మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
స్థానికం బృందం
నకిరేకల్లో నూతన సర్పంచ్లకు ఘన సన్మానం
స్థానికం ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్
నకిరేకల్: నకిరేకల్ నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి విజయం సాధించిన నూతన సర్పంచ్లు, వార్డు సభ్యులు నార్కట్పల్లి పట్టణ కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన నూతన ప్రజాప్రతినిధులను శాలువాలతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
గ్రామాల అభివృద్ధి, ప్రజాసేవే లక్ష్యంగా పనిచేస్తే ప్రజల నమ్మకం మరింత బలపడుతుందని చిరుమర్తి లింగయ్య సూచించారు. బిఆర్ఎస్ పార్టీపై ప్రజలు ఉంచిన విశ్వాసానికి ఈ విజయాలు నిదర్శనమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో రామన్నపేట మండలం బోగారం గ్రామ సర్పంచ్ కూనూరు సాయి కుమార్, లక్ష్మాపురం సర్పంచ్ పులిపలుపుల సునీత వీరస్వామి, పల్లివాడ సర్పంచ్ కంభంపాటి శ్రీనివాస్, కుంకుడుపాముల సర్పంచ్ గొలుసుల సత్తయ్యలను ఆయన సన్మానించారు. అలాగే కట్టంగూరు మేజర్ గ్రామ పంచాయతీ బిఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ ముక్కాముల శేఖర్ శ్యామల, చిట్యాల మండలం గుండ్రాంపల్లి సర్పంచ్ బత్తుల లక్ష్మీ ప్రసన్నలకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమం నూతన ప్రజాప్రతినిధుల్లో మరింత ఉత్సాహాన్ని నింపిందని, గ్రామాల సమగ్ర అభివృద్ధికి కలిసి కట్టుగా పనిచేస్తామని వారు ఈ సందర్భంగా పేర్కొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి