బహుజనుల చేతుల్లోనే రాజ్యాధికారం రావాలి. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు శేఖర్
బహుజనుల చేతుల్లోనే రాజ్యాధికారం రావాలి. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు శేఖర్
స్థానికం బృందం
ఓటర్లుగా కాదు… పాలకులుగా బహుజనులు ఎదగాలి
రాజ్యాంగం ఇచ్చిన హక్కుతో బహుజన రాజ్యాధికారం సాధ్యం
విద్య, వైద్యం, ఉపాధికి బహుజన పాలనే మార్గం
చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో మూడు వార్డుల్లో బహుజన్ సమాజ్ పార్టీ తరపున పోటీ చేసిన అభ్యర్థులకు మద్దతుగా తెలంగాణ రాష్ట్ర బీఎస్పీ అధ్యక్షులు శేఖర్ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బహుజనులు కేవలం ఓటర్లు మాత్రమే కాకుండా పాలకులుగా ఎదగాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.బహుజన రాజ్యాధికారం సాధ్యమైతే విద్య, వైద్యం, ఉపాధి, నిరుద్యోగ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని అన్నారు. పేదల తలరాతలు మార్చడానికే భారత రాజ్యాంగం రూపకల్పన జరిగిందని, రాజ్యాంగం ద్వారా పేదలకు ఓటు హక్కు కల్పించి పాలనలో భాగస్వామ్యం కల్పించారని గుర్తు చేశారు.ఒకప్పుడు ఓటు హక్కు పెత్తందారులు, భూస్వాములకే పరిమితమై ఉండేదని, వెనుకబడిన కులాలు వెలుగులోకి రావాలంటే రాజకీయ అధికారంలోకి రావడం తప్పనిసరి అని పేర్కొన్నారు. సంక్షేమ పథకాలు అందాలన్నా, సమాజంలో గౌరవం పెరగాలన్నా బహుజనులు అన్ని రాజకీయ పార్టీలతో పోటీ పడుతూ గెలిచి పాలకులుగా నిలవాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా, మండల స్థాయి బీఎస్పీ నాయకులు పాల్గొనగా, భారీ సంఖ్యలో ప్రజలు హాజరై శేఖర్కు ఘన స్వాగతం పలికారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి