Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
సర్ (ఎస్‌ఐఆర్) నమోదు ప్రక్రియను పరిశీలించిన తహశీల్దార్ మనోజ్ కుమార్ రెడ్డి తెలంగాణ పోలీసు క్రీడల్లో మూడు విభాగాల్లో కాంస్య పతకాలు సాధించి నల్లగొండ ఖ్యాతిని నిలబెట్టిన షకీర్ మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 01:18 PM

బహుజనుల చేతుల్లోనే రాజ్యాధికారం రావాలి. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు శేఖర్

బహుజనుల చేతుల్లోనే రాజ్యాధికారం రావాలి. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు శేఖర్

బహుజనుల చేతుల్లోనే రాజ్యాధికారం రావాలి. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు శేఖర్
February 08, 2026 05:07 PM 218 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఓటర్లుగా కాదు… పాలకులుగా బహుజనులు ఎదగాలి

రాజ్యాంగం ఇచ్చిన హక్కుతో బహుజన రాజ్యాధికారం సాధ్యం

విద్య, వైద్యం, ఉపాధికి బహుజన పాలనే మార్గం

చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో మూడు వార్డుల్లో బహుజన్ సమాజ్ పార్టీ తరపున పోటీ చేసిన అభ్యర్థులకు మద్దతుగా తెలంగాణ రాష్ట్ర బీఎస్పీ అధ్యక్షులు శేఖర్ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బహుజనులు కేవలం ఓటర్లు మాత్రమే కాకుండా పాలకులుగా ఎదగాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.బహుజన రాజ్యాధికారం సాధ్యమైతే విద్య, వైద్యం, ఉపాధి, నిరుద్యోగ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని అన్నారు. పేదల తలరాతలు మార్చడానికే భారత రాజ్యాంగం రూపకల్పన జరిగిందని, రాజ్యాంగం ద్వారా పేదలకు ఓటు హక్కు కల్పించి పాలనలో భాగస్వామ్యం కల్పించారని గుర్తు చేశారు.ఒకప్పుడు ఓటు హక్కు పెత్తందారులు, భూస్వాములకే పరిమితమై ఉండేదని, వెనుకబడిన కులాలు వెలుగులోకి రావాలంటే రాజకీయ అధికారంలోకి రావడం తప్పనిసరి అని పేర్కొన్నారు. సంక్షేమ పథకాలు అందాలన్నా, సమాజంలో గౌరవం పెరగాలన్నా బహుజనులు అన్ని రాజకీయ పార్టీలతో పోటీ పడుతూ గెలిచి పాలకులుగా నిలవాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా, మండల స్థాయి బీఎస్పీ నాయకులు పాల్గొనగా, భారీ సంఖ్యలో ప్రజలు హాజరై శేఖర్‌కు ఘన స్వాగతం పలికారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News