Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 04:33 AM

బహుజనుల చేతుల్లోనే రాజ్యాధికారం రావాలి. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు శేఖర్

బహుజనుల చేతుల్లోనే రాజ్యాధికారం రావాలి. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు శేఖర్

బహుజనుల చేతుల్లోనే రాజ్యాధికారం రావాలి. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు శేఖర్
February 08, 2026 05:07 PM 213 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఓటర్లుగా కాదు… పాలకులుగా బహుజనులు ఎదగాలి

రాజ్యాంగం ఇచ్చిన హక్కుతో బహుజన రాజ్యాధికారం సాధ్యం

విద్య, వైద్యం, ఉపాధికి బహుజన పాలనే మార్గం

చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో మూడు వార్డుల్లో బహుజన్ సమాజ్ పార్టీ తరపున పోటీ చేసిన అభ్యర్థులకు మద్దతుగా తెలంగాణ రాష్ట్ర బీఎస్పీ అధ్యక్షులు శేఖర్ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బహుజనులు కేవలం ఓటర్లు మాత్రమే కాకుండా పాలకులుగా ఎదగాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.బహుజన రాజ్యాధికారం సాధ్యమైతే విద్య, వైద్యం, ఉపాధి, నిరుద్యోగ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని అన్నారు. పేదల తలరాతలు మార్చడానికే భారత రాజ్యాంగం రూపకల్పన జరిగిందని, రాజ్యాంగం ద్వారా పేదలకు ఓటు హక్కు కల్పించి పాలనలో భాగస్వామ్యం కల్పించారని గుర్తు చేశారు.ఒకప్పుడు ఓటు హక్కు పెత్తందారులు, భూస్వాములకే పరిమితమై ఉండేదని, వెనుకబడిన కులాలు వెలుగులోకి రావాలంటే రాజకీయ అధికారంలోకి రావడం తప్పనిసరి అని పేర్కొన్నారు. సంక్షేమ పథకాలు అందాలన్నా, సమాజంలో గౌరవం పెరగాలన్నా బహుజనులు అన్ని రాజకీయ పార్టీలతో పోటీ పడుతూ గెలిచి పాలకులుగా నిలవాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా, మండల స్థాయి బీఎస్పీ నాయకులు పాల్గొనగా, భారీ సంఖ్యలో ప్రజలు హాజరై శేఖర్‌కు ఘన స్వాగతం పలికారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News