PRINT TIME: April 11, 2026 03:16 PM
బగ్గు సరోజినీ ఆసుపత్రిలో రోగిని పరామర్శించిన పేరాడ తిలక్
బగ్గు సరోజినీ ఆసుపత్రిలో రోగిని పరామర్శించిన పేరాడ తిలక్
January 29, 2026 09:55 PM
14 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Biksham
స్థానికం ప్రతినిధి
నేటి పరామర్శల్లో భాగంగా నందిగాం మండలం నందిగాం గ్రామానికి చెందిన అక్కురాడ కిరణ్ తల్లి సూర్యకు ఇటీవల శస్త్రచికిత్స జరిగినట్లు సమాచారం అందడంతో టెక్కలి నియోజకవర్గం వైఎస్సార్ సీపీ ఇంచార్జ్ పేరాడ తిలక్ శ్రీకాకుళంలోని బగ్గు సరోజినీ ఆసుపత్రికి వెళ్లి ఆమెను పరామర్శించారు.ఈ సందర్భంగా పేరాడ తిలక్ సూర్య ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకొని, ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి అవసరమైన సహాయం అందిస్తామని భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో నందిగాం ఎంపీపీ నడుపూరు శ్రీరామమూర్తి, నియోజకవర్గం యూత్ అధ్యక్షులు చిన్ని జోగారావు, నందిగాం ఎంపీటీసీ అంబోడి విష్ణు, బడ్డ రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి