శుభకార్యక్రమంలో రాజకీయ అతిథుల సందడి
స్థానికం ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్
నకిరేకల్ నియోజకవర్గ కేంద్రంలోని ఎస్ఎఫ్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో నల్లగొండ జిల్లా బహుజన కమ్యూనిస్టు పార్టీ నాయకులు బెల్లికొండ లింగయ్య యాదవ్ – జ్యోతి దంపతుల మనుమడి శుభకార్యక్రమం ఘనంగా జరిగింది.
ఈ శుభసందర్భానికి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దైద రవీందర్ ప్రత్యేకంగా హాజరై నూతన దంపతులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాల నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొనడంతో ఫంక్షన్ హాల్ ఉత్సవ వాతావరణంతో కళకళలాడింది.
ఈ కార్యక్రమం నకిరేకల్ నియోజకవర్గంలో రాజకీయ సౌహార్దానికి నిదర్శనంగా నిలిచిందని పాల్గొన్న నాయకులు అభిప్రాయపడ్డారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి