బీసీలు ఏకతాటిపై నిలవాలి:యాదగిరిగుట్ట శిక్షణ శిబిరాల్లో పిలుపు
బీసీలు ఏకతాటిపై నిలవాలి:యాదగిరిగుట్ట శిక్షణ శిబిరాల్లో పిలుపు
Sthanikam District Staff Reporter
బీసీల హక్కుల సాధనకు శిక్షణే ఆయుధం:జాజుల శ్రీనివాస్ గౌడ్
శిక్షణ శిబిరాల మొదటిరోజు ముఖ్య అతిథిగా హాజరైన జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్
స్థానికం: యదాద్రి భువనగిరి జిల్లా బుర్యో జి.శ్రీనివాస్
యాదగిరిగుట్ట మండల కేంద్రంలో బీసీలలో చైతన్యం తీసుకురావాలనే లక్ష్యంతో యాదగిరిగుట్టలో మన ఆలోచన సాధన ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శిక్షణ శిబిరాల మొదటిరోజు కార్యక్రమానికి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… బీసీ వర్గాలు సామాజికంగా,రాజకీయంగా, ఆర్థికంగా బలపడాలంటే చైతన్యం అత్యంత అవసరమని అన్నారు. హక్కుల సాధన కోసం బీసీలు ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు. ఇలాంటి శిక్షణ శిబిరాలు బీసీలలో అవగాహన పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో బీసీ కులాల జేఏసీ చైర్మన్ కుందరపు గణేష్ చారి,ఎంబీసీ ఎడిటర్ సూర్య రావు,బీసీ సంఘం జిల్లా అధ్యక్షులు కొత్త నరసింహస్వామి,భువనగిరి నియోజకవర్గం అధ్యక్షులు సాబన్ కార్ వెంకటేష్,రాష్ట్ర యువజన సంఘం నాయకులు గూడూరు భాస్కర్ పాల్గొన్నారు.అలాగే మండల అధ్యక్షులు జిన్న మల్లేష్ ముదిరాజ్,బొజ్జ సంబేశ్,మహిళా అధ్యక్షురాలు గుండుజ్యోతి,మహిళ ప్రధాన కార్యదర్శి ఝాన్సీ,సిరికొండ శివకుమార్,యాదగిరిగుట్ట మండల అధ్యక్షులు అశోక చారి తదితర బీసీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి