బీసీలకు చట్టబద్ధమైన బీసీ సబ్ప్లాన్ అమలు చేయాలి
బీసీలకు చట్టబద్ధమైన బీసీ సబ్ప్లాన్ అమలు చేయాలి
Editor Desk
టీఆర్పీ పార్టీ ఆధ్వర్యంలో తహసీల్దారులకు వినతిపత్రం
చిట్యాల స్థానికం ప్రతినిది ప్రశాంత్
ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ తరహాలోనే వెనుకబడిన తరగతుల (బీసీ) సమగ్ర అభివృద్ధి కోసం చట్టబద్ధమైన “బీసీ సబ్ప్లాన్”ను తక్షణమే అమలు చేయాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్పీ) హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు పాకాల నరసింహ డిమాండ్ చేశారు.టీఆర్పీ పార్టీ వ్యవస్థాపకులు, అధ్యక్షులు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆదేశాల మేరకు, రాష్ట్ర యువజన అధ్యక్షుడు బొడ్డుపల్లి చంద్రశేఖర్ సూచనలతో బుధవారం మండల తహసీల్దారులకు వినతిపత్రాలు అందజేశారు.ఈ సందర్భంగా పాకాల నరసింహ మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీల సామాజిక, ఆర్థిక, విద్యా అభివృద్ధి కోసం ప్రత్యేక బడ్జెట్ కేటాయింపులు, చట్టపరమైన రక్షణ అత్యవసరమని అన్నారు. రాష్ట్రం ఏర్పడిన 2014 నుంచి ఇప్పటివరకు బీసీల కోసం బడ్జెట్లో కేటాయించిన నిధులను పూర్తిస్థాయిలో ఖర్చు చేయకుండా మిగులు చూపడం వల్ల బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని విమర్శించారు.కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం కాంగ్రెస్ పార్టీ బీసీలకు ప్రతి బడ్జెట్లో రూ.20 వేల కోట్లు కేటాయిస్తామని ఇచ్చిన హామీని తక్షణమే అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీసీల జనాభా నిష్పత్తికి అనుగుణంగా రాష్ట్ర బడ్జెట్లో కనీసం 50 శాతం పైగా నిధులు కేటాయించాలన్నారు.బీసీల కోసం కేటాయించిన నిధులు పక్కదారి పట్టకుండా ఉండాలంటే బీసీ సబ్ప్లాన్కు చట్టబద్ధత కల్పించాల్సిందేనని స్పష్టం చేశారు. విద్యారంగంలో ప్రతి మండలంలో బహుజన గురుకుల పాఠశాలలు, కళాశాలలు ఏర్పాటు చేయాలని, విదేశీ విద్యా నిధి పథకాన్ని మరింత సరళతరం చేయాలని సూచించారు.నిరుద్యోగ బీసీ యువతకు, సంప్రదాయ కులవృత్తులపై ఆధారపడిన వారికి ఎలాంటి షరతులు లేకుండా సబ్సిడీతో కూడిన రుణాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుల గణనలో బీసీలకు సంబంధించిన నివేదికను తక్షణమే బహిర్గతం చేయాలని కోరారు.కేవలం నినాదాలతో కాకుండా నిధులతో కూడిన చట్టబద్ధమైన బీసీ సబ్ప్లాన్ ద్వారానే బీసీలకు నిజమైన సామాజిక న్యాయం సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా యువజన వర్కింగ్ ప్రెసిడెంట్ వీర్ల వేణు, హైదరాబాద్ జిల్లా యువజన వర్కింగ్ ప్రెసిడెంట్ సల్మాన్, సీనియర్ నాయకులు బంతి కిరణ్ కుమార్, రమేష్ నాయక్, బొడ్డుపల్లి మహేందర్, వెంకటాచారి, గణేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి