బీబీనగర్లో సర్పంచ్ క్షేత్రస్థాయి పర్యటన
బీబీనగర్లో సర్పంచ్ క్షేత్రస్థాయి పర్యటన
Editor Desk
బీబీనగర్: స్థానిక ప్రతినిధి
మండల కేంద్రంలోని స్థానిక 4, 5 వార్డుల్లో సర్పంచ్ పంజాల శ్రీనివాస్ గౌడ్ విస్తృతంగా పర్యటించి ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పలు వీధుల్లో డ్రైనేజీ వ్యవస్థ, రోడ్ల పరిస్థితి, మౌలిక సదుపాయాలపై స్వయంగా పర్యవేక్షణ చేపట్టారు. వీధుల్లో పేరుకుపోయిన వ్యర్థాలు, పాడైపోయిన డ్రైనేజీ పైపులను నిశితంగా పరిశీలించి, వాటి వల్ల స్థానికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఈ పర్యటనలో ఉపసర్పంచ్ నర్సింహా రెడ్డి, వార్డు సభ్యులు పాశం కవిత మహిపాల్, కాలనీ వాసులు పొట్ట నర్సింహా, పొట్ట ఫకీర, రాంపల్లి శ్రీను, పొట్ట బాలరాజు, పొట్ట వెంకటస్వామి, గోలంకొండ రాజు, దేవరుప్పుల శ్రీకాంత్, పొట్ట శరత్, పొట్ట వెంకటేష్, పొట్ట అనిల్తో పాటు గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి