బీబీ నగర్ ఎయిమ్స్లో వైద్య సేవలపై కల్వకుంట్ల కవిత సమీక్ష
బీబీ నగర్ ఎయిమ్స్లో వైద్య సేవలపై కల్వకుంట్ల కవిత సమీక్ష
Editor Desk
ఎయిమ్స్ అభివృద్ధి పనులు, రోగుల సేవలపై ప్రత్యేక దృష్టి
భువనగిరి స్థానికం ప్రతినిధి
యాదాద్రి భువనగిరి జిల్లా బీబీ నగర్లోని ఎయిమ్స్ను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సందర్శించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలపై వైద్యాధికారులను వివరంగా అడిగి తెలుసుకున్నారు.
వైద్య సదుపాయాలు, చికిత్స విధానాలు, రోగులకు అందిస్తున్న సేవల నాణ్యతపై కవిత ప్రత్యేక దృష్టి సారించారు. అదే సమయంలో ఎయిమ్స్ను సందర్శనకు వచ్చిన పాఠశాల విద్యార్థులను ఆప్యాయంగా పలకరిస్తూ వారితో కాసేపు మాట్లాడారు.
ఎయిమ్స్ బిల్డింగ్ మోడల్ను చూపిస్తూ జరుగుతున్న అభివృద్ధి పనులు, భవిష్యత్ విస్తరణ ప్రణాళికలను వైద్య అధికారులు వివరించారు. జిల్లా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే దిశగా ఎయిమ్స్ కీలకంగా మారుతున్న తీరును ఈ సందర్శన మరోసారి స్పష్టం చేసింది.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి