Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
Community Power for Health: Walkathon Sparks Preventive Care Movement సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 02:38 PM

బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మ జ్యోతిరావు పూలే

బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మ జ్యోతిరావు పూలే

బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మ జ్యోతిరావు పూలే
April 11, 2026 12:54 PM 25 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

విద్యతోనే సమాజ అభ్యున్నతి సాధ్యం – రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, మొరిశెట్టి నివేదిత లక్షాది

జిల్లా కేంద్రం: బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మ జ్యోతిరావు పూలే అని ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది పేర్కొన్నారు.శనివారం జిల్లా కేంద్రంలోని ఎంజి రోడ్డులో మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు మహాత్మ జ్యోతిరావు పూలే అడుగుజాడల్లో నడవాలని అన్నారు. మహిళల విద్య ప్రాముఖ్యతను అప్పుడే గుర్తించి, వారికి ప్రత్యేక పాఠశాలలు ఏర్పాటు చేసిన గొప్ప సంస్కర్త అని తెలిపారు.

తన భార్య సావిత్రిబాయి పూలేకు విద్య నేర్పించి, ఆమెను ఉపాధ్యాయురాలిగా తీర్చిదిద్దిన మహానుభావుడు అని కొనియాడారు.

ఈ దేశంలో మహాత్మ అనే బిరుదు పొందినవారిలో ఒకరు మహాత్మా గాంధీ అయితే, మరొకరు మహాత్మ జ్యోతిరావు పూలే మాత్రమే అని తెలిపారు. సమానత్వ సమాజ స్థాపన, మహిళల విద్యాభివృద్ధి, మానవ హక్కుల పరిరక్షణలో ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని అన్నారు.మహాత్మ జ్యోతిరావు పూలే ఆశయాలను ముందుకు తీసుకెళ్లడం మనందరి బాధ్యత అని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆయన జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్నదని, జిల్లాలో అక్షరాస్యత పెంపు, ఆడపిల్లల విద్యాభివృద్ధి కోసం చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. మహాత్మ జ్యోతిరావు పూలే చూపిన మార్గంలో నడిచి సమానత్వ సమాజ నిర్మాణానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News