Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 05:44 PM

బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మ జ్యోతిరావు పూలే

బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మ జ్యోతిరావు పూలే

బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మ జ్యోతిరావు పూలే
April 11, 2026 12:54 PM 61 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

విద్యతోనే సమాజ అభ్యున్నతి సాధ్యం – రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, మొరిశెట్టి నివేదిత లక్షాది

జిల్లా కేంద్రం: బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మ జ్యోతిరావు పూలే అని ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది పేర్కొన్నారు.శనివారం జిల్లా కేంద్రంలోని ఎంజి రోడ్డులో మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు మహాత్మ జ్యోతిరావు పూలే అడుగుజాడల్లో నడవాలని అన్నారు. మహిళల విద్య ప్రాముఖ్యతను అప్పుడే గుర్తించి, వారికి ప్రత్యేక పాఠశాలలు ఏర్పాటు చేసిన గొప్ప సంస్కర్త అని తెలిపారు.

తన భార్య సావిత్రిబాయి పూలేకు విద్య నేర్పించి, ఆమెను ఉపాధ్యాయురాలిగా తీర్చిదిద్దిన మహానుభావుడు అని కొనియాడారు.

ఈ దేశంలో మహాత్మ అనే బిరుదు పొందినవారిలో ఒకరు మహాత్మా గాంధీ అయితే, మరొకరు మహాత్మ జ్యోతిరావు పూలే మాత్రమే అని తెలిపారు. సమానత్వ సమాజ స్థాపన, మహిళల విద్యాభివృద్ధి, మానవ హక్కుల పరిరక్షణలో ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని అన్నారు.మహాత్మ జ్యోతిరావు పూలే ఆశయాలను ముందుకు తీసుకెళ్లడం మనందరి బాధ్యత అని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆయన జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్నదని, జిల్లాలో అక్షరాస్యత పెంపు, ఆడపిల్లల విద్యాభివృద్ధి కోసం చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. మహాత్మ జ్యోతిరావు పూలే చూపిన మార్గంలో నడిచి సమానత్వ సమాజ నిర్మాణానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News