Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మానవత్వం చాటిన స్థానికం దినపత్రిక ఎడిటర్ డాక్టర్ కొండ మల్లేశం గౌడ్ 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 01, 2026 12:52 PM

బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బిఆర్ అంబేద్కర్ : జైపాల్ నాయక్

బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బిఆర్ అంబేద్కర్ : జైపాల్ నాయక్

బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బిఆర్ అంబేద్కర్ : జైపాల్ నాయక్
April 14, 2026 01:39 PM 116 Views
Reporter
స్థానికం ప్రతినిధి : SANGAREDDY DISTRICT
Sandeep journalist

బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరు ఆచరణలో పెట్టాలని గిరిజన సంక్షేమ సంఘం ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షులు బొమ్మరెడ్డిగూడెం గ్రామ సర్పంచ్ జైపాల్ నాయక్ అన్నారు

మంగళవారం నాడు బొమ్మ రెడ్డి గూడెం గ్రామపంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135 జయంతి వేడుకలను నిర్వహించారు ఈ సందర్భంగా గిరిజన సంక్షేమ సంఘం ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షులు జైపాల్ నాయక్ మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాణంలో అంబేద్కర్ చేసిన సేవలు అపారమని తెలిపారు. శ్వాసక్తితో ఉన్నత విద్యను అభ్యసించిన మహోన్నత వ్యక్తి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ప్రపంచ దేశాల నుండి ఉత్తమ అంశాలను స్వీకరించి భారత రాజ్యాంగాన్ని రూపొందించడం ఆయన గొప్పతనం అన్నారు ప్రజాస్వామ్య వ్యవస్థలో స్వేచ్ఛ, సమానత్వం,న్యాయం అందరికీ చేరేలా చేసిన మహానీయుడు అంబేద్కర్ అని పేర్కొన్నారు ఆయన ఆలోచనలు, రచనలు ప్రతి తరానికి మార్గదర్శకమని అన్నారు అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాత గొప్ప సంఘ సంస్కర్త ఆర్థికవేత్త మరి న్యాయవాది అంటరానితనానికి కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడి, అన్నగారిన వర్గాల హక్కుల కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడి మార్గంలో మనమందరం నడవాలని అన్నారు

ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ డైరెక్టర్ రాములు నాయక్ నాయకులు శంకర్ నాయక్, నందులాల్, సంతోష్, బొమ్మరాజు శ్రీనివాస్, బైరు ప్రవీణ్ బైరు రవి,సర్వన్ నాయక్, ప్రభు, మూడ్ సంతోష్, ఆనంద్, ఆంజనేయులు లు పాల్గొన్నరు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News