Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 04:56 AM

బడంపేట జాతరలో డా॥ సిద్దం ఉజ్వల్ రెడ్డి ప్రత్యేక పూజలు

బడంపేట జాతరలో డా॥ సిద్దం ఉజ్వల్ రెడ్డి ప్రత్యేక పూజలు

బడంపేట జాతరలో డా॥ సిద్దం ఉజ్వల్ రెడ్డి ప్రత్యేక పూజలు
February 23, 2026 11:37 PM 28 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

జహీరాబాద్ నియోజకవర్గంలో

కోహీర్ మండలంలోని బడంపేట గ్రామంలో జరుగుతున్న రాచన్న స్వామి సమేత భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థాన జాతర మహోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ప్రతి సంవత్సరం నిర్వహించే ఈ జాతరకు పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కళకళలాడుతూ ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.ఈ జాతర మహోత్సవాల సందర్భంగా సోమవారం రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు డా॥ సిద్దం ఉజ్వల్ రెడ్డి ఆలయాన్ని సందర్శించి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నియోజకవర్గ ప్రజల శ్రేయస్సు, శాంతి, సౌభాగ్యం కోసం ప్రార్థనలు చేశారు. ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఉత్సవ కమిటీ సభ్యులు శాలువా కప్పి సన్మానించి తీర్థప్రసాదాలు అందజేశారు.ఈ సందర్భంగా ఉజ్వల్ రెడ్డి మాట్లాడుతూ, ఈ ప్రాంత ప్రజల ఆరాధ్య దైవమైన రాచన్న స్వామి ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకున్నారు.ప్రజలు సుఖసంతోషాలతో జీవించాలని, గ్రామాలు అభివృద్ధి దిశగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు.జాతరను విజయవంతంగా నిర్వహిస్తున్న ఉత్సవ కమిటీ సభ్యులను అభినందించారు.ఈ కార్యక్రమంలో జహీరాబాద్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నర్సింహారెడ్డి, యువజన కాంగ్రెస్ అసెంబ్లీ అధ్యక్షుడు నాగిరెడ్డి, సీనియర్ నాయకులు శ్రీకాంత్ రెడ్డి, రాష్ట్ర యువజన కాంగ్రెస్ కార్యదర్శి హర్షవర్ధన్ రెడ్డి, అశ్విన్ పాటిల్, నథానెయల్, జగదీశ్వర్ రెడ్డి, పట్టణ సభ సభ్యుడు అరుణ్ కుమార్, అక్షయ్ జాడే, రాజు యాదవ్, నర్సింహా యాదవ్, ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు జగదీశ్ స్వామి, శ్రీపాల్ రాజయ్య, రాజ్ కుమార్ తదితరులు, అనేక మంది నాయకులు, కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News