Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
లక్ష్య సాధనకు పట్టుదల అవసరం కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 03:07 PM

బడంపేట జాతరలో డా॥ సిద్దం ఉజ్వల్ రెడ్డి ప్రత్యేక పూజలు

బడంపేట జాతరలో డా॥ సిద్దం ఉజ్వల్ రెడ్డి ప్రత్యేక పూజలు

బడంపేట జాతరలో డా॥ సిద్దం ఉజ్వల్ రెడ్డి ప్రత్యేక పూజలు
February 23, 2026 11:37 PM 19 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

జహీరాబాద్ నియోజకవర్గంలో

కోహీర్ మండలంలోని బడంపేట గ్రామంలో జరుగుతున్న రాచన్న స్వామి సమేత భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థాన జాతర మహోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ప్రతి సంవత్సరం నిర్వహించే ఈ జాతరకు పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కళకళలాడుతూ ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.ఈ జాతర మహోత్సవాల సందర్భంగా సోమవారం రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు డా॥ సిద్దం ఉజ్వల్ రెడ్డి ఆలయాన్ని సందర్శించి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నియోజకవర్గ ప్రజల శ్రేయస్సు, శాంతి, సౌభాగ్యం కోసం ప్రార్థనలు చేశారు. ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఉత్సవ కమిటీ సభ్యులు శాలువా కప్పి సన్మానించి తీర్థప్రసాదాలు అందజేశారు.ఈ సందర్భంగా ఉజ్వల్ రెడ్డి మాట్లాడుతూ, ఈ ప్రాంత ప్రజల ఆరాధ్య దైవమైన రాచన్న స్వామి ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకున్నారు.ప్రజలు సుఖసంతోషాలతో జీవించాలని, గ్రామాలు అభివృద్ధి దిశగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు.జాతరను విజయవంతంగా నిర్వహిస్తున్న ఉత్సవ కమిటీ సభ్యులను అభినందించారు.ఈ కార్యక్రమంలో జహీరాబాద్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నర్సింహారెడ్డి, యువజన కాంగ్రెస్ అసెంబ్లీ అధ్యక్షుడు నాగిరెడ్డి, సీనియర్ నాయకులు శ్రీకాంత్ రెడ్డి, రాష్ట్ర యువజన కాంగ్రెస్ కార్యదర్శి హర్షవర్ధన్ రెడ్డి, అశ్విన్ పాటిల్, నథానెయల్, జగదీశ్వర్ రెడ్డి, పట్టణ సభ సభ్యుడు అరుణ్ కుమార్, అక్షయ్ జాడే, రాజు యాదవ్, నర్సింహా యాదవ్, ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు జగదీశ్ స్వామి, శ్రీపాల్ రాజయ్య, రాజ్ కుమార్ తదితరులు, అనేక మంది నాయకులు, కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News