బడి బాటతో గ్రామంలో చైతన్యం ప్రభుత్వ పాఠశాలల్లో చేరాలని ప్రజలకు విజ్ఞప్తి
బడి బాటతో గ్రామంలో చైతన్యం ప్రభుత్వ పాఠశాలల్లో చేరాలని ప్రజలకు విజ్ఞప్తి
K.RAVI
పీపల్ పహాడ్ గ్రామంలో బడి బాట కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి, సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, ఉపాధ్యాయులు కలిసి గ్రామంలో వాడవాడ తిరిగి విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని ప్రజలను కోరారు. ప్రైవేట్ పాఠశాలల కంటే ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతున్నదని తెలిపారు. నర్సరీ నుంచి 10వ తరగతి వరకు ఇంగ్లీష్, తెలుగు మాధ్యమాల్లో విద్య అందుబాటులో ఉందని వివరించారు.సర్పంచ్ పులనగారి నాగేశ్వరి–అశ్విన్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. తమ పిల్లలను కూడా ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పిస్తామని తెలిపారు. మండల విద్యాధికారి గురువారవు మాట్లాడుతూ పీపల్ పహాడ్ గ్రామం విద్యలో ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు.ఈ
కార్యక్రమంలో ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శోభ, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు నిరంజన్ రెడ్డి, ఉప సర్పంచ్ బకనగారి శ్రవణ్ కుమార్ గౌడ్, వార్డు సభ్యులు బద్దం సుదాకర్ రెడ్డి, పిల్లి సాయి, ఉపాధ్యాయ బృందం, గ్రామ పెద్దలు, యువకులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి