PRINT TIME: May 26, 2026 07:45 PM
బాధితుడిని పరామర్శించిన చైర్మన్ నాగేష్ కుమార్ షేట్కార్
బాధితుడిని పరామర్శించిన చైర్మన్ నాగేష్ కుమార్ షేట్కార్
March 30, 2026 03:12 PM
55 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Krishna
నారాయణఖేడ్ నియోజకవర్గం నారాయణఖేడ్ మున్సిపాలిటీ ఇందిరానగర్కు చెందిన రిటైర్డ్ అటెండర్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శనిగరపు హనుమయ్య బైక్పై నుంచి పడిపోవడంతో కాలుకు గాయమై ప్రస్తుతం సంగారెడ్డిలోని గోకుల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఖేడ్ మున్సిపల్ చైర్మన్ నాగేష్ కుమార్ షేట్కార్ ఆసుపత్రికి వెళ్లి హనుమయ్యను పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి కుమారుడు పరమేష్కు ధైర్యం చెప్పి, వైద్యులతో మాట్లాడి హనుమయ్యకు అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని సూచించారు. అవసరమైన సహాయం అందిస్తామని హామీ ఇవ్వడంతో కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి