బాధ్యతలు స్వీకరించిన వి శ్రీనివాసరావు
బాధ్యతలు స్వీకరించిన వి శ్రీనివాసరావు
Biksham
జిల్లా పౌర సంబంధాల అధికారిగా బాధ్యతల చేపట్టడం
సూర్యాపేట నూతన జిల్లా పౌర సంబంధాల అధికారిగా వి శ్రీనివాసరావు సోమవారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. జిల్లా సమాచార వ్యవస్థను మరింత బలోపేతం చేయడం, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు సమర్థంగా చేరవేయడం లక్ష్యంగా పనిచేస్తానని ఈ సందర్భంగా తెలిపారు.బాధ్యతలు చేపట్టిన అనంతరం జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ను, అదనపు కలెక్టర్ కె సీతారామారావును వి శ్రీనివాసరావు మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాలో అమలవుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వ విధానాల ప్రచారం, ప్రజలకు సమాచారం పారదర్శకంగా అందించే అంశాలపై వారి మధ్య చర్చ జరిగింది.జిల్లా పౌర సంబంధాల శాఖ ద్వారా ప్రభుత్వ కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు ప్రజలకు సకాలంలో చేరేలా మీడియాతో సమన్వయంతో పనిచేస్తానని వి శ్రీనివాసరావు తెలిపారు. అలాగే పాత్రికేయులతో స్నేహపూర్వక సంబంధాలు కొనసాగిస్తూ ప్రజలకు నిజమైన సమాచారం అందించేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు.జిల్లా పరిపాలనలో పౌర సంబంధాల శాఖ కీలక పాత్ర పోషిస్తుందని, ప్రజలతో ప్రభుత్వానికి మధ్య వంతెనగా పనిచేయాల్సిన బాధ్యత ఉందని ఈ సందర్భంగా అధికారులు సూచించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి