Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 05:30 AM

బడ్జెట్‌లో దివ్యాంగులకు దిక్సూచి కావాలి – డాక్టర్ ఎన్. అశోక్

బడ్జెట్‌లో దివ్యాంగులకు దిక్సూచి కావాలి – డాక్టర్ ఎన్. అశోక్

బడ్జెట్‌లో దివ్యాంగులకు దిక్సూచి కావాలి – డాక్టర్ ఎన్. అశోక్
February 14, 2026 06:55 PM 243 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

తెలంగాణ రాష్ట్రంలో దివ్యాంగులు అనేక సమస్యలను ఎదుర్కొంటూ సమాజంలో నిలబడేందుకు పోరాడుతున్నారని డాక్టర్ ఎన్. అశోక్ ఆవేదన వ్యక్తం చేశారు. రానున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో దివ్యాంగుల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క ప్రవేశపెట్టే బడ్జెట్‌లో ఇప్పటివరకు ఎప్పుడూ లేనివిధంగా దివ్యాంగులకు రెండింతల నిధులు కేటాయించాలని కోరారు. విద్య, ఉపాధి, స్వయం ఉపాధి, ఆరోగ్యం, పింఛన్లు, సహాయక పరికరాలు వంటి అన్ని రంగాల్లో సమగ్ర సహాయం అందించాల్సిన అవసరం ఉందన్నారు.

ఇప్పటికీ ప్రభుత్వాలు దివ్యాంగులను పట్టించుకోకపోవడంతో వారి సమస్యలపై సుప్రీంకోర్టు, హైకోర్టులు మార్గదర్శకాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. కనీస అవసరాలు కూడా నెరవేర్చని పరిస్థితిలో దివ్యాంగులు గౌరవప్రదమైన జీవితం గడపడం కష్టమవుతోందన్నారు.

అన్ని శాఖల్లో దివ్యాంగులకు కేటాయించిన ఉద్యోగాలను భర్తీ చేయకుండా, నియమ నిబంధనలు పాటించకపోవడం అన్యాయమని విమర్శించారు. తక్షణమే ఉద్యోగ నియామకాలు పూర్తి చేసి, ఆర్థికంగా బలపడేలా ప్రత్యేక నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.

ఈ బడ్జెట్‌లో కూడా తక్కువ నిధులు కేటాయిస్తే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టి దివ్యాంగుల హక్కుల కోసం పోరాటం చేయాల్సి వస్తుందని డాక్టర్ ఎన్. అశోక్ హెచ్చరించారు.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News