Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: February 24, 2026 04:20 AM

బాధిత కుటుంబానికి ఊరట: రూ.2.50 లక్షల సహాయం

బాధిత కుటుంబానికి ఊరట: రూ.2.50 లక్షల సహాయం

బాధిత కుటుంబానికి ఊరట: రూ.2.50 లక్షల సహాయం
December 29, 2025 07:15 PM 338 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
స్థానికం బృందం

ప్రమాద బాధిత కుటుంబానికి ఎల్‌ఓసి చెక్కు అందజేత

రామన్నపేటలో రూ.2.50 లక్షల సహాయం

రామన్నపేట: స్థానికం ప్రతినిధి

రామన్నపేట మండలం ఇంద్రపాలనగరం గ్రామానికి చెందిన సింగనబోయిన నరేష్ ఇటీవల జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడి పంజాగుట్ట నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ సహాయంగా మంజూరైన ఎల్‌ఓసి చెక్కు రూ.2,50,000ను నరేష్ కుటుంబ సభ్యులకు అందజేశారు.

నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం చొరవతో ప్రభుత్వం నుంచి ఈ ఆర్థిక సహాయం మంజూరైంది. గత కొద్ది రోజుల క్రితం కూడా రెండు సార్లు ఎల్‌ఓసి చెక్కులను బాధిత కుటుంబానికి అందజేయడం జరిగింది. బాధితుని ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ కుటుంబానికి అండగా నిలుస్తున్నట్లు జిల్లా నాయకులు తెలిపారు.

ఈ సందర్భంగా జిల్లా నాయకుడు పూస బాలకిషన్ మాట్లాడుతూ, నరేష్ కుటుంబానికి ప్రభుత్వం తరఫున అన్ని విధాలా సహాయం అందేలా చర్యలు తీసుకుంటున్నామని, బాధిత కుటుంబానికి ధైర్యం చెప్పడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని అన్నారు.

ప్రభుత్వ సహాయంతో పాటు ప్రజాప్రతినిధులు, నాయకుల చొరవతో బాధిత కుటుంబానికి ఊరట లభిస్తోందని స్థానికులు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News