Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
​బీసీ ఉద్యోగుల ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలి: ఎంపీ ఆర్. కృష్ణయ్య కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పిం కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 08:31 PM

బాధిత కుటుంబానికి ఊరట: రూ.2.50 లక్షల సహాయం

బాధిత కుటుంబానికి ఊరట: రూ.2.50 లక్షల సహాయం

బాధిత కుటుంబానికి ఊరట: రూ.2.50 లక్షల సహాయం
December 29, 2025 07:15 PM 355 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ప్రమాద బాధిత కుటుంబానికి ఎల్‌ఓసి చెక్కు అందజేత

రామన్నపేటలో రూ.2.50 లక్షల సహాయం

రామన్నపేట: స్థానికం ప్రతినిధి

రామన్నపేట మండలం ఇంద్రపాలనగరం గ్రామానికి చెందిన సింగనబోయిన నరేష్ ఇటీవల జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడి పంజాగుట్ట నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ సహాయంగా మంజూరైన ఎల్‌ఓసి చెక్కు రూ.2,50,000ను నరేష్ కుటుంబ సభ్యులకు అందజేశారు.

నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం చొరవతో ప్రభుత్వం నుంచి ఈ ఆర్థిక సహాయం మంజూరైంది. గత కొద్ది రోజుల క్రితం కూడా రెండు సార్లు ఎల్‌ఓసి చెక్కులను బాధిత కుటుంబానికి అందజేయడం జరిగింది. బాధితుని ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ కుటుంబానికి అండగా నిలుస్తున్నట్లు జిల్లా నాయకులు తెలిపారు.

ఈ సందర్భంగా జిల్లా నాయకుడు పూస బాలకిషన్ మాట్లాడుతూ, నరేష్ కుటుంబానికి ప్రభుత్వం తరఫున అన్ని విధాలా సహాయం అందేలా చర్యలు తీసుకుంటున్నామని, బాధిత కుటుంబానికి ధైర్యం చెప్పడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని అన్నారు.

ప్రభుత్వ సహాయంతో పాటు ప్రజాప్రతినిధులు, నాయకుల చొరవతో బాధిత కుటుంబానికి ఊరట లభిస్తోందని స్థానికులు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News