అయిటిపాముల ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన ఎంపీ, ఎమ్మెల్యే
అయిటిపాముల ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన ఎంపీ, ఎమ్మెల్యే
Komidala Mahender reddy
కట్టంగూర్ మండలం అయిటిపాముల గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని భువనగిరి పార్లమెంట్ సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రంలో రైతుల నుంచి ధాన్యం సేకరణ ప్రక్రియ, తూకం విధానం, తరలింపు ఏర్పాట్లు తదితర అంశాలను పరిశీలించి రైతులతో నేరుగా మాట్లాడారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, రైతులు ఎలాంటి ఆందోళనకు గురికాకుండా ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని స్పష్టం చేశారు.అధికారులు సమన్వయంతో పని చేసి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో తాగునీరు, నీడ, తార్పాలిన్లు, విశ్రాంతి స్థలం వంటి మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దళారుల ప్రమేయం లేకుండా పారదర్శకంగా కొనుగోళ్లు నిర్వహించాలని సూచించారు.
చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని, రైతుల ఖాతాల్లో 48 గంటల్లో డబ్బు జమ అయ్యేలా పర్యవేక్షిస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, మార్కెట్ కమిటీ సభ్యులు, వ్యవసాయ శాఖ, పౌరసరఫరాల శాఖ అధికారులు, రైతులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి