అయిటిపాముల ధాన్యం కొనుగోలు కేంద్రలను పరిశీలించిన ఎంపీ, ఎమ్మెల్యే
అయిటిపాముల ధాన్యం కొనుగోలు కేంద్రలను పరిశీలించిన ఎంపీ, ఎమ్మెల్యే
Editor Desk
కట్టంగూర్ మండలం అయిటిపాముల గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం శనివారం పరిశీలించారు.
ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రంలో రైతుల నుంచి ధాన్యం సేకరణ, తూకం విధానం, తరలింపు ఏర్పాట్లను పరిశీలించి రైతులతో మాట్లాడారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. తాగునీరు, నీడ, తార్పాలిన్లు, విశ్రాంతి సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. దళారుల ప్రమేయం లేకుండా పారదర్శకంగా కొనుగోళ్లు నిర్వహించాలని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రైతుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, రైతుల ఖాతాల్లో 48 గంటల్లోనే డబ్బులు జమయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, మార్కెట్ కమిటీ సభ్యులు, వ్యవసాయ, పౌరసరఫరాల శాఖ అధికారులు, రైతులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి