PRINT TIME: April 10, 2026 07:52 AM
అయ్యప్ప స్వామి సన్నిధానంలో అన్నదానం…
అయ్యప్ప స్వామి సన్నిధానంలో అన్నదానం…
January 01, 2026 06:48 PM
244 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
రామన్నపేట స్థానిక ప్రతినిధి
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం బోగారం గ్రామంలో హరిహరపుత్ర అయ్యప్ప స్వామి సన్నిధానంలో అన్నదాన కార్యక్రమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. స్థానిక ప్రాథమిక ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ముస్కు వెంకటరెడ్డి ఆధ్వర్యంలో అయ్యప్ప మాల దీక్షపరులకు అన్నదానం ఏర్పాటు చేశారు.
ప్రతి సంవత్సరం ఆనవాయితీగా స్వామివారి సన్నిధానంలో అన్నదానం నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. బోగారంలోని అయ్యప్ప స్వామి భక్తుల కొంగుబంగారంగా విరజిల్లుతున్నాడని, స్వామి కృపతో గ్రామం శాంతిసౌఖ్యాలతో ఉండాలని భక్తులు ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో అయ్యప్ప మాల దీక్షపరులు, గురుస్వాములు, గ్రామ భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్నదానం స్వీకరించారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి