అవయవ దానం ఒక అశ్వమేధ యాగం
అవయవ దానం ఒక అశ్వమేధ యాగం
Biksham
అవయవ దానానికి అంగీకారం తెలిపిన డిఎస్వి శర్మ – సమాజానికి స్ఫూర్తిదాయకం
స్పందన శరీర, అవయవ దాన సంస్థ ఆధ్వర్యంలో సోమవారం పట్టణానికి చెందిన విశ్రాంత జిల్లా పరిషత్ ఉప ముఖ్య కార్యనిర్వహణాధికారి డిఎస్వి శర్మ తమ అవయవ దాన అంగీకార పత్రాన్ని సంస్థ ప్రతినిధులకు అందజేశారు.
ఈ సందర్భంగా స్పందన స్వచ్ఛంద సంస్థ గౌరవ అధ్యక్షుడు గుండా రమేష్ మాట్లాడుతూ డిఎస్వి శర్మ విశాల దృక్పథంతో, మానవీయ కోణంలో పవిత్ర ఆశయంతో అవయవ దాతగా ముందుకు రావడం సమాజానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. అవయవ దానం ఒక అశ్వమేధ యాగంతో సమానమని, ఈ ముందడుగు భావితరాలకు ప్రేరణగా నిలుస్తుందని తెలిపారు.
సంస్థ అధ్యక్షుడు జి రమేష్, కార్యదర్శి మిట్ట కోల కోటయ్య, కోశాధికారి హెచ్ పిచ్చిరెడ్డి, సభ్యుడు రౌతు రమేష్ అంగీకార పత్రాన్ని స్వీకరిస్తూ డిఎస్వి శర్మ సహృదయతను, సత్సంకల్పాన్ని అభినందించారు.
ఈ సందర్భంగా శర్మ మాట్లాడుతూ అవయవ దానం ద్వారా మనిషి మరణానంతరం కూడా ఇతరులలో జీవిస్తూ తన జన్మను సార్థకం చేసుకోవచ్చని తెలిపారు. అలాగే ఇది వైద్య విద్యార్థులకు శాస్త్రీయ పరిశోధనలకు ఉపయోగపడే విధంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి