అవలీలగా గెలుస్తామనుకున్నా కాంగ్రెస్ అభ్యర్థులు చిత్తుగా ఓడారు
అవలీలగా గెలుస్తామనుకున్నా కాంగ్రెస్ అభ్యర్థులు చిత్తుగా ఓడారు
K.RAVI
చిత్తుగా ఓడిపోయిన వెన్ రెడ్డి సంధ్య మూడవ స్థానానికి పడిపోయిన సుర్వి మంజుల
అవలీలగా గెలుస్తామనుకున్న ఇద్దరు కాంగ్రెస్ అభ్యర్ధులు ప్రత్యర్ధుల చేతిలో చిత్తుగా ఓడి పోయారు. శుక్రవారం వెలువడిన మున్నిపల్ ఎన్నికల ఫలితాల్లో చౌటుప్పల్ 16 వవార్డులో కాంగ్రెస్ తరపున పోటీ చేసిన మాజీ మున్సిపల్ ఛైర్మన్ వెన్ రెడ్డి రాజు సతీమణి వెన్ రెడ్డి సంధ్య, 2 వ వార్డు బరిలో నిలిచిన మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సుర్వి నర్సింహా గౌడ్ సతీమణి సుర్వి మంజుల లు ఘోర పరాజయం పాలయ్యారు. అధికారపార్టీ నుంచి రంగంలోకి దిగిన వారికి ప్రజల ఆశీస్సులు దక్కలేదు.16వ వార్డులో వెన్ రెడ్డి సంధ్య పై ప్రత్యర్థి సిపిఎం అభ్యర్ధి బత్తుల జయమ్మ 374 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందగా, 2వ వార్డులో సుర్వి మంజులపై ప్రత్యర్ధి బిజెపి అభ్యర్థి పోలేపల్లి లక్ష్మి 183 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. ఇక్కడ రెండవ స్థానంలో బీఆర్ఎస్ అభ్యర్థి వలందాసు స్వాతి నిలిచారు.
16 వార్డులో నిశ్శబ్ద విప్లవం...
16 వ వార్డులో ఓటర్ల లో నిశ్శబ్ద విప్లవం చాపకింద నీరులా విస్తరించింది.అది పసిగట్టలేక పోయిన మాజీ ఛైర్మన్ వెన్ రెడ్డి రాజు తన సతీమణి వెన్ రెడ్డి సంధ్య భారీ ఆధిక్యంతో గెలుస్తుందని అంచనా వేశారు. కానీ చివరకు ఫలితం తారుమారైంది. ఒక సామాన్య మహిళ సిపిఎంకు చెందిన అభ్యర్ధి బత్తుల జయమ్మ చేతిలో చిత్తుగా ఓడిపోక తప్పలేదు. ఆమె ఓటమికి కారణం... వెన్ రెడ్డి రాజుపై వార్డు ప్రజల్లో నెలకొన్న తీవ్ర వ్యతిరేకత, అసంతృప్తే కారణమని తెలుస్తోంది. ఈ సంచలన ప్రజా తీర్పు భవిష్యత్తులో ఎన్నికల్లో పోటీ చేయ బోయే ప్రతి అభ్యర్థికి గుణపాఠంగా నిలుస్తుందన్న చర్చ పుర ప్రజల్లో సర్వత్రా విపిపిస్తోంది.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి