అవకాశం ఇవ్వండి నాయకుడిగా కాదు మీ సేవకుడిగా ఉంటా
అవకాశం ఇవ్వండి నాయకుడిగా కాదు మీ సేవకుడిగా ఉంటా
K.RAVI
పిల్లలమర్రి మధుసూదన్ 19వ వార్డ్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి
చౌటుప్పల్ మున్సిపాలిటీ 19 వ వార్డ్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థిగా పిల్లలమర్రి మధుసూదన్ మున్సిపల్ ఎన్నికల బరిలోకి అడుగుపెట్టారు. ప్రజా జీవితంలోకి ఆయన ఇదే మొదటి అడుగు కాగా, తొలిసారి ప్రజల ముందుకు వచ్చి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.సమాజ సేవే లక్ష్యంగా రాజకీయాల్లోకి వచ్చానని పిల్లలమర్రి మధుసూదన్ అన్నారు.19 వ వార్డులో నెలకొన్న మౌలిక సమస్యలు, అభివృద్ధి అవసరాలను గుర్తించి, ప్రజల భాగస్వామ్యంతో పరిష్కార దిశగా పనిచేస్తానని చెప్పారు. ముఖ్యంగా తాగునీరు, డ్రైనేజీ, రోడ్లు, పారిశుద్ధ్యం వంటి అంశాలకు ప్రాధాన్యం ఇస్తానని స్పష్టం చేశారు.తనపై నమ్మకంతో మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అవకాశం కల్పించడంపై ఆయన కృతజ్ఞతలు తెలిపారు.రానున్న మున్సిపల్ ఎన్నికల్లో 19వ వార్డు ప్రజలు తనను ఆదరించి ఆశీర్వదిస్తారని ఆశాభావం వ్యక్తంచేశారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ,నన్ను తొలిసారి పరీక్షించే అవకాశం ప్రజలకు వచ్చింది. నిజాయితీగా పనిచేసే అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి ఆశీర్వదించాలి అని ప్రజలను కోరారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి