అత్తగారింటి ముందు బీభత్సం – ద్విచక్ర వాహనం దగ్ధం
అత్తగారింటి ముందు బీభత్సం – ద్విచక్ర వాహనం దగ్ధం
Sthanikam District Staff Reporter krishna
నారాయణఖేడ్ స్థానికం ప్రతినిధి కృష్ణ:నారాయణఖేడ్ నియోజకవర్గంలో నిజాంపేట్ మండల కేంద్రంలో భార్య కాపురానికి రావడంలేదన్న కారణంతో అల్లుడు ఆగ్రహానికి లోనై అత్తగారింటి వద్ద బీభత్సానికి పాల్పడ్డ ఘటన స్థానికంగా కలకలం రేపింది.కుటుంబ వివాదం తీవ్ర స్థాయికి చేరి, అల్లుడు అత్తగారింటికి నిప్పంటించడంతో పాటు బామ్మర్దికి చెందిన ద్విచక్ర వాహనాన్ని తగలబెట్టిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది.స్థానికుల కథనం ప్రకారం, కొంతకాలంగా దంపతుల మధ్య కుటుంబ వివాదాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో భార్య తన పుట్టింట్లో ఉంటుండగా, పలుమార్లు కాపురానికి రావాలని కోరినప్పటికీ ఆమె అంగీకరించకపోవడంతో అల్లుడు తీవ్ర కోపానికి గురయ్యాడు.ఈ కోపంతో నిజాంపేటలోని అత్తగారింటికి వచ్చిన అతడు, వాగ్వాదానికి దిగిన అనంతరం ఆగ్రహంతో ఇంటి ముందు ఆస్తికి నిప్పంటించినట్లు సమాచారం.ఈ ఘటనలో అత్తగారింటి ముందు ఉన్న వస్తువులు దగ్ధమయ్యాయి. అలాగే బామ్మర్దికి చెందిన ద్విచక్ర వాహనం పూర్తిగా కాలిపోయింది. స్థానికులు వెంటనే స్పందించి మంటలను ఆర్పే ప్రయత్నం చేయడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.ఈ ఘటనపై బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కుటుంబ వివాదాల కారణంగా శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ఘటనపై పూర్తి వివరాలు తెలుసుకుంటున్నట్లు తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి