Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 03:51 AM

అత్తగారింటి ముందు బీభత్సం – ద్విచక్ర వాహనం దగ్ధం

అత్తగారింటి ముందు బీభత్సం – ద్విచక్ర వాహనం దగ్ధం

అత్తగారింటి ముందు బీభత్సం – ద్విచక్ర వాహనం దగ్ధం
January 16, 2026 06:07 PM 385 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ స్థానికం ప్రతినిధి కృష్ణ:నారాయణఖేడ్ నియోజకవర్గంలో నిజాంపేట్ మండల కేంద్రంలో భార్య కాపురానికి రావడంలేదన్న కారణంతో అల్లుడు ఆగ్రహానికి లోనై అత్తగారింటి వద్ద బీభత్సానికి పాల్పడ్డ ఘటన స్థానికంగా కలకలం రేపింది.కుటుంబ వివాదం తీవ్ర స్థాయికి చేరి, అల్లుడు అత్తగారింటికి నిప్పంటించడంతో పాటు బామ్మర్దికి చెందిన ద్విచక్ర వాహనాన్ని తగలబెట్టిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది.స్థానికుల కథనం ప్రకారం, కొంతకాలంగా దంపతుల మధ్య కుటుంబ వివాదాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో భార్య తన పుట్టింట్లో ఉంటుండగా, పలుమార్లు కాపురానికి రావాలని కోరినప్పటికీ ఆమె అంగీకరించకపోవడంతో అల్లుడు తీవ్ర కోపానికి గురయ్యాడు.ఈ కోపంతో నిజాంపేటలోని అత్తగారింటికి వచ్చిన అతడు, వాగ్వాదానికి దిగిన అనంతరం ఆగ్రహంతో ఇంటి ముందు ఆస్తికి నిప్పంటించినట్లు సమాచారం.ఈ ఘటనలో అత్తగారింటి ముందు ఉన్న వస్తువులు దగ్ధమయ్యాయి. అలాగే బామ్మర్దికి చెందిన ద్విచక్ర వాహనం పూర్తిగా కాలిపోయింది. స్థానికులు వెంటనే స్పందించి మంటలను ఆర్పే ప్రయత్నం చేయడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.ఈ ఘటనపై బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కుటుంబ వివాదాల కారణంగా శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ఘటనపై పూర్తి వివరాలు తెలుసుకుంటున్నట్లు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News