Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తడ్కల్‌లో మహమ్మద్ ప్రవక్త జన్మదిన వేడుకలు.. భారీ ర్యాలీలో పాల్గొన్న యువత, ప్రజలు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 06:35 PM

అత్తగారింటి ముందు బీభత్సం – ద్విచక్ర వాహనం దగ్ధం

అత్తగారింటి ముందు బీభత్సం – ద్విచక్ర వాహనం దగ్ధం

అత్తగారింటి ముందు బీభత్సం – ద్విచక్ర వాహనం దగ్ధం
16-01-2026 390 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ స్థానికం ప్రతినిధి కృష్ణ:నారాయణఖేడ్ నియోజకవర్గంలో నిజాంపేట్ మండల కేంద్రంలో భార్య కాపురానికి రావడంలేదన్న కారణంతో అల్లుడు ఆగ్రహానికి లోనై అత్తగారింటి వద్ద బీభత్సానికి పాల్పడ్డ ఘటన స్థానికంగా కలకలం రేపింది.కుటుంబ వివాదం తీవ్ర స్థాయికి చేరి, అల్లుడు అత్తగారింటికి నిప్పంటించడంతో పాటు బామ్మర్దికి చెందిన ద్విచక్ర వాహనాన్ని తగలబెట్టిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది.స్థానికుల కథనం ప్రకారం, కొంతకాలంగా దంపతుల మధ్య కుటుంబ వివాదాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో భార్య తన పుట్టింట్లో ఉంటుండగా, పలుమార్లు కాపురానికి రావాలని కోరినప్పటికీ ఆమె అంగీకరించకపోవడంతో అల్లుడు తీవ్ర కోపానికి గురయ్యాడు.ఈ కోపంతో నిజాంపేటలోని అత్తగారింటికి వచ్చిన అతడు, వాగ్వాదానికి దిగిన అనంతరం ఆగ్రహంతో ఇంటి ముందు ఆస్తికి నిప్పంటించినట్లు సమాచారం.ఈ ఘటనలో అత్తగారింటి ముందు ఉన్న వస్తువులు దగ్ధమయ్యాయి. అలాగే బామ్మర్దికి చెందిన ద్విచక్ర వాహనం పూర్తిగా కాలిపోయింది. స్థానికులు వెంటనే స్పందించి మంటలను ఆర్పే ప్రయత్నం చేయడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.ఈ ఘటనపై బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కుటుంబ వివాదాల కారణంగా శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ఘటనపై పూర్తి వివరాలు తెలుసుకుంటున్నట్లు తెలిపారు.

Sthanikam

అత్తగారింటి ముందు బీభత్సం – ద్విచక్ర వాహనం దగ్ధం

Article Image

నారాయణఖేడ్ స్థానికం ప్రతినిధి కృష్ణ:నారాయణఖేడ్ నియోజకవర్గంలో నిజాంపేట్ మండల కేంద్రంలో భార్య కాపురానికి రావడంలేదన్న కారణంతో అల్లుడు ఆగ్రహానికి లోనై అత్తగారింటి వద్ద బీభత్సానికి పాల్పడ్డ ఘటన స్థానికంగా కలకలం రేపింది.కుటుంబ వివాదం తీవ్ర స్థాయికి చేరి, అల్లుడు అత్తగారింటికి నిప్పంటించడంతో పాటు బామ్మర్దికి చెందిన ద్విచక్ర వాహనాన్ని తగలబెట్టిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది.స్థానికుల కథనం ప్రకారం, కొంతకాలంగా దంపతుల మధ్య కుటుంబ వివాదాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో భార్య తన పుట్టింట్లో ఉంటుండగా, పలుమార్లు కాపురానికి రావాలని కోరినప్పటికీ ఆమె అంగీకరించకపోవడంతో అల్లుడు తీవ్ర కోపానికి గురయ్యాడు.ఈ కోపంతో నిజాంపేటలోని అత్తగారింటికి వచ్చిన అతడు, వాగ్వాదానికి దిగిన అనంతరం ఆగ్రహంతో ఇంటి ముందు ఆస్తికి నిప్పంటించినట్లు సమాచారం.ఈ ఘటనలో అత్తగారింటి ముందు ఉన్న వస్తువులు దగ్ధమయ్యాయి. అలాగే బామ్మర్దికి చెందిన ద్విచక్ర వాహనం పూర్తిగా కాలిపోయింది. స్థానికులు వెంటనే స్పందించి మంటలను ఆర్పే ప్రయత్నం చేయడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.ఈ ఘటనపై బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కుటుంబ వివాదాల కారణంగా శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ఘటనపై పూర్తి వివరాలు తెలుసుకుంటున్నట్లు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News