Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గుంజలూరులో ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 04:50 PM

అంత్యక్రియలకు ఆర్థిక సహాయం అందించిన జీఎంఆర్ ఫౌండేషన్

అంత్యక్రియలకు ఆర్థిక సహాయం అందించిన జీఎంఆర్ ఫౌండేషన్

అంత్యక్రియలకు ఆర్థిక సహాయం అందించిన జీఎంఆర్ ఫౌండేషన్
January 27, 2026 07:39 PM 239 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ స్థానికం ప్రతినిధి కృష్ణ

పెద్ద శంకరంపేట్ మండలం మూసాపేట్ గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన వడ్డే వెంకయ్య ఇటీవల మృతి చెందిన విషయం గ్రామ సర్పంచ్ ఆడివయ్య జీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్, భారత రాష్ట్ర సమితి పార్టీ నాయకుడు గుఱ్ఱపు మచ్చేందర్ దృష్టికి తీసుకువచ్చారు.ఈ విషయం తెలుసుకున్న వెంటనే గుఱ్ఱపు మచ్చేందర్ మానవీయ దృక్పథంతో స్పందించి, మృతుని కుటుంబానికి అండగా నిలిచి వారి అంత్యక్రియల నిర్వహణ కోసం తక్షణమే ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సహాయం పేద కుటుంబానికి ఎంతో ఊరటను కలిగించింది.ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ ఆడివయ్య మాట్లాడుతూ, కష్టసమయంలో పేద ప్రజలకు అండగా నిలుస్తూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న జీఎంఆర్ ఫౌండేషన్ సేవలు అభినందనీయమని అన్నారు. ఇలాంటి సేవలు సమాజానికి ఆదర్శంగా నిలుస్తాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉప్పరి బాలయ్య, బైకరీ సాయిలు, కొంగొండ నర్సింలు తదితర గ్రామ ప్రముఖులు, స్థానికులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News