అంత్యక్రియలకు ఆర్థిక సహాయం అందించిన జీఎంఆర్ ఫౌండేషన్
అంత్యక్రియలకు ఆర్థిక సహాయం అందించిన జీఎంఆర్ ఫౌండేషన్
Krishna
నారాయణఖేడ్ స్థానికం ప్రతినిధి కృష్ణ
పెద్ద శంకరంపేట్ మండలం మూసాపేట్ గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన వడ్డే వెంకయ్య ఇటీవల మృతి చెందిన విషయం గ్రామ సర్పంచ్ ఆడివయ్య జీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్, భారత రాష్ట్ర సమితి పార్టీ నాయకుడు గుఱ్ఱపు మచ్చేందర్ దృష్టికి తీసుకువచ్చారు.ఈ విషయం తెలుసుకున్న వెంటనే గుఱ్ఱపు మచ్చేందర్ మానవీయ దృక్పథంతో స్పందించి, మృతుని కుటుంబానికి అండగా నిలిచి వారి అంత్యక్రియల నిర్వహణ కోసం తక్షణమే ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సహాయం పేద కుటుంబానికి ఎంతో ఊరటను కలిగించింది.ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ ఆడివయ్య మాట్లాడుతూ, కష్టసమయంలో పేద ప్రజలకు అండగా నిలుస్తూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న జీఎంఆర్ ఫౌండేషన్ సేవలు అభినందనీయమని అన్నారు. ఇలాంటి సేవలు సమాజానికి ఆదర్శంగా నిలుస్తాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉప్పరి బాలయ్య, బైకరీ సాయిలు, కొంగొండ నర్సింలు తదితర గ్రామ ప్రముఖులు, స్థానికులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి