Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డీఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో పూలే జయంతి కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 12, 2026 02:55 AM

అత్తే హంతకురాలు కుటుంబ కలహాలే హత్యకు కారణం వేగంగా కేసు ఛేదించిన పోలీసులు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు

అత్తే హంతకురాలు కుటుంబ కలహాలే హత్యకు కారణం వేగంగా కేసు ఛేదించిన పోలీసులు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు

అత్తే హంతకురాలు కుటుంబ కలహాలే హత్యకు కారణం వేగంగా కేసు ఛేదించిన పోలీసులు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు
January 08, 2026 04:12 PM 300 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

రెడ్డిగూడెం స్ధానికం ఏపీ స్టేట్ బ్యూరో గడ్డం జగన్మోహన్ రెడ్డి ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం రెడ్డిగూడెం మండలం రాఘవాపురంలో ఈనెల నాలుగోతేది అర్థరాత్రి హత్యకు గురైన సంగెపు శ్రావణి కేసులో ప్రధాన నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరస్తున్నట్లు సి ఐ చంద్రశేఖర్ తెలిపారు. బుధవారం నాడు మైలవరం సి ఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన తెలిపిన వివరాల ప్రకారం హతురాలు సంగెపు శ్రావణి కి తన అత్త సంగెపు పద్మావతి (59)కీ మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అత్త పద్మావతి మరొక నిందితురాలు పొగర్త కోటమ్మ(38)తో కలిసి శ్రావణిని అంతం చేయడానికి ముందుగా అనుకున్న ప్రకారం నాలుగో తేది రాత్రి పద్మావతి, కోటమ్మ కలిసి ఇంట్లో ఉన్న రాడ్ బెండింగ్ కి ఉపయోగించే ఇనుప పైప్ తో కొట్టి ,గొంతు నులిమి హత్య చేశారు. హతురాలు తండ్రి వెంకటేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పోలీసులు 6 బృందాలుగా బయలుదేరి విచారణ చేస్తుండగా నిందితులు రెడ్డిగూడెం నుండి రుద్రవరం వెళ్లే దారిలో నరుకుళ్ళపాడు అడ్ఢరోడ్డువద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులు నేరం ఒప్పుకోవడంతో హత్యకు ఉపయోగించిన రాడ్ బెండింగ్ ఇనుప పైప్ ను రాఘవాపురం కోతుల వాగులో మధ్య వర్తుల సమక్షంలో స్వాధీనం చేసుకొని నిందితులను మైలవరం మేజిస్ట్రేట్ వారి ముందు హజరుపరుస్తామని సి ఐ చంద్రశేఖర్ తెలిపారు. ఈ కేసు విషయమై తదుపరి ధర్యాప్తు కొనసాగుతుందని సిఐ తెలియజేసారు. ఈ సమావేశంలో రెడ్డిగూడెం ఎస్ ఐ ఎస్ శ్రీను, రెడ్డిగూడెం పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News