Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 03:00 AM

అత్తే హంతకురాలు కుటుంబ కలహాలే హత్యకు కారణం వేగంగా కేసు ఛేదించిన పోలీసులు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు

అత్తే హంతకురాలు కుటుంబ కలహాలే హత్యకు కారణం వేగంగా కేసు ఛేదించిన పోలీసులు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు

అత్తే హంతకురాలు కుటుంబ కలహాలే హత్యకు కారణం వేగంగా కేసు ఛేదించిన పోలీసులు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు
08-01-2026 319 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

రెడ్డిగూడెం స్ధానికం ఏపీ స్టేట్ బ్యూరో గడ్డం జగన్మోహన్ రెడ్డి ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం రెడ్డిగూడెం మండలం రాఘవాపురంలో ఈనెల నాలుగోతేది అర్థరాత్రి హత్యకు గురైన సంగెపు శ్రావణి కేసులో ప్రధాన నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరస్తున్నట్లు సి ఐ చంద్రశేఖర్ తెలిపారు. బుధవారం నాడు మైలవరం సి ఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన తెలిపిన వివరాల ప్రకారం హతురాలు సంగెపు శ్రావణి కి తన అత్త సంగెపు పద్మావతి (59)కీ మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అత్త పద్మావతి మరొక నిందితురాలు పొగర్త కోటమ్మ(38)తో కలిసి శ్రావణిని అంతం చేయడానికి ముందుగా అనుకున్న ప్రకారం నాలుగో తేది రాత్రి పద్మావతి, కోటమ్మ కలిసి ఇంట్లో ఉన్న రాడ్ బెండింగ్ కి ఉపయోగించే ఇనుప పైప్ తో కొట్టి ,గొంతు నులిమి హత్య చేశారు. హతురాలు తండ్రి వెంకటేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పోలీసులు 6 బృందాలుగా బయలుదేరి విచారణ చేస్తుండగా నిందితులు రెడ్డిగూడెం నుండి రుద్రవరం వెళ్లే దారిలో నరుకుళ్ళపాడు అడ్ఢరోడ్డువద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులు నేరం ఒప్పుకోవడంతో హత్యకు ఉపయోగించిన రాడ్ బెండింగ్ ఇనుప పైప్ ను రాఘవాపురం కోతుల వాగులో మధ్య వర్తుల సమక్షంలో స్వాధీనం చేసుకొని నిందితులను మైలవరం మేజిస్ట్రేట్ వారి ముందు హజరుపరుస్తామని సి ఐ చంద్రశేఖర్ తెలిపారు. ఈ కేసు విషయమై తదుపరి ధర్యాప్తు కొనసాగుతుందని సిఐ తెలియజేసారు. ఈ సమావేశంలో రెడ్డిగూడెం ఎస్ ఐ ఎస్ శ్రీను, రెడ్డిగూడెం పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు

Sthanikam

అత్తే హంతకురాలు కుటుంబ కలహాలే హత్యకు కారణం వేగంగా కేసు ఛేదించిన పోలీసులు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు

Article Image

రెడ్డిగూడెం స్ధానికం ఏపీ స్టేట్ బ్యూరో గడ్డం జగన్మోహన్ రెడ్డి ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం రెడ్డిగూడెం మండలం రాఘవాపురంలో ఈనెల నాలుగోతేది అర్థరాత్రి హత్యకు గురైన సంగెపు శ్రావణి కేసులో ప్రధాన నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరస్తున్నట్లు సి ఐ చంద్రశేఖర్ తెలిపారు. బుధవారం నాడు మైలవరం సి ఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన తెలిపిన వివరాల ప్రకారం హతురాలు సంగెపు శ్రావణి కి తన అత్త సంగెపు పద్మావతి (59)కీ మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అత్త పద్మావతి మరొక నిందితురాలు పొగర్త కోటమ్మ(38)తో కలిసి శ్రావణిని అంతం చేయడానికి ముందుగా అనుకున్న ప్రకారం నాలుగో తేది రాత్రి పద్మావతి, కోటమ్మ కలిసి ఇంట్లో ఉన్న రాడ్ బెండింగ్ కి ఉపయోగించే ఇనుప పైప్ తో కొట్టి ,గొంతు నులిమి హత్య చేశారు. హతురాలు తండ్రి వెంకటేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పోలీసులు 6 బృందాలుగా బయలుదేరి విచారణ చేస్తుండగా నిందితులు రెడ్డిగూడెం నుండి రుద్రవరం వెళ్లే దారిలో నరుకుళ్ళపాడు అడ్ఢరోడ్డువద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులు నేరం ఒప్పుకోవడంతో హత్యకు ఉపయోగించిన రాడ్ బెండింగ్ ఇనుప పైప్ ను రాఘవాపురం కోతుల వాగులో మధ్య వర్తుల సమక్షంలో స్వాధీనం చేసుకొని నిందితులను మైలవరం మేజిస్ట్రేట్ వారి ముందు హజరుపరుస్తామని సి ఐ చంద్రశేఖర్ తెలిపారు. ఈ కేసు విషయమై తదుపరి ధర్యాప్తు కొనసాగుతుందని సిఐ తెలియజేసారు. ఈ సమావేశంలో రెడ్డిగూడెం ఎస్ ఐ ఎస్ శ్రీను, రెడ్డిగూడెం పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News