అత్తే హంతకురాలు కుటుంబ కలహాలే హత్యకు కారణం వేగంగా కేసు ఛేదించిన పోలీసులు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు
అత్తే హంతకురాలు కుటుంబ కలహాలే హత్యకు కారణం వేగంగా కేసు ఛేదించిన పోలీసులు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు
GADDAM JAGANMOHAN REDDY
రెడ్డిగూడెం స్ధానికం ఏపీ స్టేట్ బ్యూరో గడ్డం జగన్మోహన్ రెడ్డి ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం రెడ్డిగూడెం మండలం రాఘవాపురంలో ఈనెల నాలుగోతేది అర్థరాత్రి హత్యకు గురైన సంగెపు శ్రావణి కేసులో ప్రధాన నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరస్తున్నట్లు సి ఐ చంద్రశేఖర్ తెలిపారు. బుధవారం నాడు మైలవరం సి ఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన తెలిపిన వివరాల ప్రకారం హతురాలు సంగెపు శ్రావణి కి తన అత్త సంగెపు పద్మావతి (59)కీ మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అత్త పద్మావతి మరొక నిందితురాలు పొగర్త కోటమ్మ(38)తో కలిసి శ్రావణిని అంతం చేయడానికి ముందుగా అనుకున్న ప్రకారం నాలుగో తేది రాత్రి పద్మావతి, కోటమ్మ కలిసి ఇంట్లో ఉన్న రాడ్ బెండింగ్ కి ఉపయోగించే ఇనుప పైప్ తో కొట్టి ,గొంతు నులిమి హత్య చేశారు. హతురాలు తండ్రి వెంకటేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పోలీసులు 6 బృందాలుగా బయలుదేరి విచారణ చేస్తుండగా నిందితులు రెడ్డిగూడెం నుండి రుద్రవరం వెళ్లే దారిలో నరుకుళ్ళపాడు అడ్ఢరోడ్డువద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులు నేరం ఒప్పుకోవడంతో హత్యకు ఉపయోగించిన రాడ్ బెండింగ్ ఇనుప పైప్ ను రాఘవాపురం కోతుల వాగులో మధ్య వర్తుల సమక్షంలో స్వాధీనం చేసుకొని నిందితులను మైలవరం మేజిస్ట్రేట్ వారి ముందు హజరుపరుస్తామని సి ఐ చంద్రశేఖర్ తెలిపారు. ఈ కేసు విషయమై తదుపరి ధర్యాప్తు కొనసాగుతుందని సిఐ తెలియజేసారు. ఈ సమావేశంలో రెడ్డిగూడెం ఎస్ ఐ ఎస్ శ్రీను, రెడ్డిగూడెం పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి