Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మద్యానికి చెక్… నీర్నములలో సంచలన నిర్ణయం సర్పంచ్ కందిమల్ల గోపాల్ రెడ్డి “500 గర్భిణులను బైక్‌లో రక్షించిన ప్రాణదాత: ఛత్తీస్‌గఢ్ ‘బైక్ హీరో’ సురేష్ బెల్సారే” “మండల మహిళా సమాఖ్యల ఆధ్వర్యంలో ఆర్టీసీకి అద్దె బస్సులు… మహిళల ఆర్థిక సాధికారతకు కొత్త దిశ : సి‌ఎం రేవంత్” చెన్నైపై రాజస్థాన్ రాయల్స్ ఘనవిజయం.. సూర్యవంశీ ఊచకోత! రామోత్సవం ఘనంగా నిర్వహణ – భక్తులకు ఆధ్యాత్మిక సందేశాలు “పరిశోధనలతోనే ఉన్నత విద్యకు నాణ్యత: అకాడమిక్ కౌన్సిల్‌లో చర్చ” అమరావతి శాశ్వత రాజధాని తీర్మానంపై హర్షం వ్యక్తం చేసిన రంగేపల్లి వెంకటరమణ “డబ్బు కోసం జీవితాన్ని వదులుకుంటాం… చివరికి ఆ డబ్బుతోనే జీవితాన్ని కొనలేము… ఇదే నిజం!” “సిగ్నల్ లేకున్నా సంభాషణ… ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఆఫ్రికా యువ శాస్త్రవేత్త సంచలన ఆవిష్కరణ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: April 03, 2026 09:32 PM

ఆత్మీయ భరోసా" ను వెంటనే అమలు చేయాలి.

ఆత్మీయ భరోసా" ను వెంటనే అమలు చేయాలి.

ఆత్మీయ భరోసా" ను వెంటనే అమలు చేయాలి.
April 03, 2026 06:56 PM 0 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శినారి ఐలయ్య

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే వ్యవసాయ కార్మికులందరికీ ఆత్మీయ భరోసా కింద 12 వేల రూపాయలు సంవత్సరానికి ఇస్తామని చెప్పి నేటికీ అమలుకు నోచుకోలేదని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి నారి ఐలయ్య విమర్శించారు. శనివారం నాడు చిట్యాల మండలం గుండ్రంపల్లి గ్రామంలో జరుగుతున్నటువంటి ఉపాధి హామీ పనులను పరిశీలించి కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ కోటి ఆశలతో రేవంత్ రెడ్డి గారిని అధికారంలోకి తీసుకువచ్చిన వ్యవసాయ కార్మికులకు సంవత్సరానికి 12 వేల రూపాయలు ఆత్మీయ భరోసా కింద ఇస్తామని చెప్పి రెండు సంవత్సరాలు గడుస్తున్న నేటికీ ఇవ్వకపోవడం వ్యవసాయ కార్మికుల మీద నిర్లక్ష్య చేస్తూ పేద మధ్యతరగతి కార్మికుల పట్ల ముఖ్యమంత్రి ధోరణి సరికాదని తెలిపారు. ఎర్రటి ఎండలో పనిచేస్తున్న కార్మికుల చేతులు బొగ్గలు వచ్చినప్పటికీ పనికి తగ్గ వేతనం రావట్లేదని కొలతలు లేకుండా వేతనాలు చెల్లించాలని రోజుకు 800 రూపాయల కూలి ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్మికులకు పనిముట్లు గడ్డపార, టెంకే, మంచినీళ్లు, టెంటు, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తక్షణమే అందించాలని,50 సంవత్సరాలు నిండిన వ్యవసాయ కార్మికులకు 3000 పెన్షన్ ఇచ్చి కార్మికులను ఆదుకోవాలని, రెండు పూటలా ఫోటో విధానాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు కత్తుల లింగస్వామి సంఘం నాయకులు కాసర్ల ముత్తయ్య, అంతటి రాధ, కొంతం మనమ్మ, కంకల సరిత,మస్కు యాదమ్మ, అచ్చిన ఐలమ్మ, గోపగోని హేమలత, మారగోని విజయ, కొయ్యగూర శారద, కుంభం సుజాత, రెడపాక అమృత, కంకల సరిత, రాచకొండ లక్ష్మమ్మ, కుక్కల నిర్మల తదితరులు పాల్గొన్నారు.

అనంతరం నూతన కమిటీ అధ్యక్షులుగా అంతటి రాధ, ఉపాధ్యక్షులుగా కొంతం మనమ్మ, కార్యదర్శిగా జవ్వాజి అలివేలు, సహాయ కార్యదర్శిగా మారగొని విజయ, కోశాధికారిగా కాసర్ల ముత్తయ్య తోపాటు 11 మంది కమిటీ సభ్యులతో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News