ఆత్మీయ భరోసా" ను వెంటనే అమలు చేయాలి.
ఆత్మీయ భరోసా" ను వెంటనే అమలు చేయాలి.
Komidala Mahender reddy
తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శినారి ఐలయ్య
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే వ్యవసాయ కార్మికులందరికీ ఆత్మీయ భరోసా కింద 12 వేల రూపాయలు సంవత్సరానికి ఇస్తామని చెప్పి నేటికీ అమలుకు నోచుకోలేదని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి నారి ఐలయ్య విమర్శించారు. శనివారం నాడు చిట్యాల మండలం గుండ్రంపల్లి గ్రామంలో జరుగుతున్నటువంటి ఉపాధి హామీ పనులను పరిశీలించి కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ కోటి ఆశలతో రేవంత్ రెడ్డి గారిని అధికారంలోకి తీసుకువచ్చిన వ్యవసాయ కార్మికులకు సంవత్సరానికి 12 వేల రూపాయలు ఆత్మీయ భరోసా కింద ఇస్తామని చెప్పి రెండు సంవత్సరాలు గడుస్తున్న నేటికీ ఇవ్వకపోవడం వ్యవసాయ కార్మికుల మీద నిర్లక్ష్య చేస్తూ పేద మధ్యతరగతి కార్మికుల పట్ల ముఖ్యమంత్రి ధోరణి సరికాదని తెలిపారు. ఎర్రటి ఎండలో పనిచేస్తున్న కార్మికుల చేతులు బొగ్గలు వచ్చినప్పటికీ పనికి తగ్గ వేతనం రావట్లేదని కొలతలు లేకుండా వేతనాలు చెల్లించాలని రోజుకు 800 రూపాయల కూలి ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్మికులకు పనిముట్లు గడ్డపార, టెంకే, మంచినీళ్లు, టెంటు, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తక్షణమే అందించాలని,50 సంవత్సరాలు నిండిన వ్యవసాయ కార్మికులకు 3000 పెన్షన్ ఇచ్చి కార్మికులను ఆదుకోవాలని, రెండు పూటలా ఫోటో విధానాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు కత్తుల లింగస్వామి సంఘం నాయకులు కాసర్ల ముత్తయ్య, అంతటి రాధ, కొంతం మనమ్మ, కంకల సరిత,మస్కు యాదమ్మ, అచ్చిన ఐలమ్మ, గోపగోని హేమలత, మారగోని విజయ, కొయ్యగూర శారద, కుంభం సుజాత, రెడపాక అమృత, కంకల సరిత, రాచకొండ లక్ష్మమ్మ, కుక్కల నిర్మల తదితరులు పాల్గొన్నారు.
అనంతరం నూతన కమిటీ అధ్యక్షులుగా అంతటి రాధ, ఉపాధ్యక్షులుగా కొంతం మనమ్మ, కార్యదర్శిగా జవ్వాజి అలివేలు, సహాయ కార్యదర్శిగా మారగొని విజయ, కోశాధికారిగా కాసర్ల ముత్తయ్య తోపాటు 11 మంది కమిటీ సభ్యులతో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి