అశ్విని,అప్షాబేగం లకు విశిష్ట ప్రశంసా సర్టిఫికెట్లు అందజేత
అశ్విని,అప్షాబేగం లకు విశిష్ట ప్రశంసా సర్టిఫికెట్లు అందజేత
Krishna
నారాయణఖేడ్ స్థానికం ప్రతినిధి కృష్ణ
నారాయణఖేడ్ నియోజకవర్గంలో సిర్గాపూర్ మండల కేంద్రంలోని బాలికల గురుకుల పాఠశాల మరియు కళాశాలలో జిల్లా మహిళా సాధికారత కేంద్రం, మహిళా, శిశు, వికలాంగులు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జాతీయ బాలిక దినోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది.ఈ ముఖ్య కార్యక్రమంలో నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పి. సంజీవరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ ఉమా హారతి,జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారి కేతావత్ లలిత కుమారి చేతుల మీదుగా బోరంచ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థులుగా అశ్విని (విద్యా ప్రమాణాలు) మరియు అప్షాబేగం (క్రీడలు)లకి ప్రశంసా సర్టిఫికెట్లు అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో సిర్గాపూర్ సర్పంచ్ నరసింహ రావు పాటిల్, చైల్డ్ హెల్ప్ లైన్ ప్రతినిధి యాదగిరి, మండల విద్యాధికారి నగరం శ్రీనివాస్, పాఠశాల ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు శివకుమార్ స్వామి, ఉపాధ్యాయులు మహేష్ కుమార్ మరియు పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని ఘనవంతంగా విజయవంతం చేశారు.ఈ కార్యక్రమం ద్వారా బాలికల సాధికారత, విద్యా, క్రీడా ప్రగతి మరియు సమగ్రాభివృద్ధి కోసం ప్రభుత్వ మరియు స్థానిక సంస్థల అంకితభావం ప్రతిబింబించింది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి