అష్టముఖ గండభేరుండ నరసింహస్వామి అలంకరణలో సాలగ్రామ నారాయణుడి దర్శనం.
అష్టముఖ గండభేరుండ నరసింహస్వామి అలంకరణలో సాలగ్రామ నారాయణుడి దర్శనం.
Prabhakar
ఆనంద్ బాగ్ శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర ఆలయం లోని సాలగ్రామ నారాయణుడికి భీష్మ ఏకాదశి పర్వదినం సందర్భంగా గండభేరుండ నరసింహస్వామి అవతారంలో భక్తులను అనుగ్రహించారు.
ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు ముడుంబై వెంకట రమణా చార్యులు మాట్లాడుతూ విష్ణుమూర్తి యొక్క అత్యంత ఉగ్రమైన, అరుదైన రూపం. హిరణ్యకశిపుని సంహరించిన తర్వాత నరసింహుని కోపాన్ని తగ్గించడానికి, శరభుడిని ఓడించడానికి విష్ణువు ఈ రెండు తలల పక్షి, గండభేరుండ రూపాన్ని ధరించారు. దీనిని అష్టముఖ గండభేరుండ నరసింహ స్వామి అని కూడా పిలుస్తారు. గండభేరుండ నరసింహస్వామి హయగ్రీవ, వ్యాఘ్ర, సింహ, గండభేరుండ (రెండు తలల పక్షి), భల్లుక, ఎలుగుబంటి, గరుడ, ఆంజనేయ, వరాహ,
ఎనిమిది ముఖాలు, 32 చేతులతో ఉంటారు. ఈ స్వామిని ఆరాధించడం వల్ల శత్రు సంహారం, రోగ నివారణ, దుష్టశక్తుల నుండి రక్షణ కలుగుతుందని, ఇది అపారమైన మాయా శక్తి కలిగిన రూపంగా పురాణాల్లో తెలుపబడింది అని అన్నారు. ఈ సందర్భంగా ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారని ఆలయ ఈఓ ఏబి రవీందర్ రెడ్డి తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు తులసి వెంకట రమణ చార్యులు, క్లర్క్ సండ్ర సుధాకర్, పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి