Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 05:47 PM

అష్టముఖ గండభేరుండ నరసింహస్వామి అలంకరణలో సాలగ్రామ నారాయణుడి దర్శనం.

అష్టముఖ గండభేరుండ నరసింహస్వామి అలంకరణలో సాలగ్రామ నారాయణుడి దర్శనం.

అష్టముఖ గండభేరుండ నరసింహస్వామి అలంకరణలో సాలగ్రామ నారాయణుడి దర్శనం.
January 30, 2026 09:43 AM 49 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Medchal Malkajgiri incharge
Prabhakar

ఆనంద్ బాగ్ శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర ఆలయం లోని సాలగ్రామ నారాయణుడికి భీష్మ ఏకాదశి పర్వదినం సందర్భంగా గండభేరుండ నరసింహస్వామి అవతారంలో భక్తులను అనుగ్రహించారు.

ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు ముడుంబై వెంకట రమణా చార్యులు మాట్లాడుతూ విష్ణుమూర్తి యొక్క అత్యంత ఉగ్రమైన, అరుదైన రూపం. హిరణ్యకశిపుని సంహరించిన తర్వాత నరసింహుని కోపాన్ని తగ్గించడానికి, శరభుడిని ఓడించడానికి విష్ణువు ఈ రెండు తలల పక్షి, గండభేరుండ రూపాన్ని ధరించారు. దీనిని అష్టముఖ గండభేరుండ నరసింహ స్వామి అని కూడా పిలుస్తారు. గండభేరుండ నరసింహస్వామి హయగ్రీవ, వ్యాఘ్ర, సింహ, గండభేరుండ (రెండు తలల పక్షి), భల్లుక, ఎలుగుబంటి, గరుడ, ఆంజనేయ, వరాహ,

ఎనిమిది ముఖాలు, 32 చేతులతో ఉంటారు. ఈ స్వామిని ఆరాధించడం వల్ల శత్రు సంహారం, రోగ నివారణ, దుష్టశక్తుల నుండి రక్షణ కలుగుతుందని, ఇది అపారమైన మాయా శక్తి కలిగిన రూపంగా పురాణాల్లో తెలుపబడింది అని అన్నారు. ఈ సందర్భంగా ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారని ఆలయ ఈఓ ఏబి రవీందర్ రెడ్డి తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు తులసి వెంకట రమణ చార్యులు, క్లర్క్ సండ్ర సుధాకర్, పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News