ఆశీర్వదిస్తే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా
ఆశీర్వదిస్తే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా
Editor Desk
సర్పంచ్ అభ్యర్థి కందిమల్ల గోపాల్ రెడ్డి
స్థానికం ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని నీర్నెముల గ్రామంలో
ఎమ్మెల్యే వేముల వీరేశం సహకారంతో గ్రామాన్ని ఆదర్శగ్రామంగా తీర్చిదిద్దుతామని గ్రామ కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి కందిమల్ల గోపాల్ రెడ్డి అన్నారు. మండలంలోని నీర్నెముల గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి ఆదివారం నాయకులు, కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీగా బయలుదేరి ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఉంగరం గుర్తుకు ఓటేయాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందఠరేగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ హాయంలోనే మన గ్రామం అభివృద్ధి చెందుతుందని అన్నారు. నిరుపేద కుటుంబాలకు ఇల్లు లేని వారికి ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, కళ్యాణలక్ష్మి, ఆసరా పింఛన్లు ఇవ్వడం జరుగుతుందని అన్నారు. గ్రామ ప్రజలు ఉంగరం గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఆడపడుచులు, యువకులు ఓటు వేసి ఆశీర్వదించాలన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి