Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గంజాయితో ఐదుగురు అరెస్ట్ భూ వివాదాలకు చెక్… భూభారతి పోర్టల్‌కు శ్రీకారం “టికెట్ ఉంటే సీటు తప్పనిసరి… ఇది ప్రతి పౌరుని హక్కు!” చెన్నైపై రాజస్థాన్ రాయల్స్ ఘనవిజయం.. సూర్యవంశీ ఊచకోత! రామోత్సవం ఘనంగా నిర్వహణ – భక్తులకు ఆధ్యాత్మిక సందేశాలు “పరిశోధనలతోనే ఉన్నత విద్యకు నాణ్యత: అకాడమిక్ కౌన్సిల్‌లో చర్చ” అమరావతి శాశ్వత రాజధాని తీర్మానంపై హర్షం వ్యక్తం చేసిన రంగేపల్లి వెంకటరమణ “డబ్బు కోసం జీవితాన్ని వదులుకుంటాం… చివరికి ఆ డబ్బుతోనే జీవితాన్ని కొనలేము… ఇదే నిజం!” “సిగ్నల్ లేకున్నా సంభాషణ… ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఆఫ్రికా యువ శాస్త్రవేత్త సంచలన ఆవిష్కరణ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: April 01, 2026 09:24 PM

అసెంబ్లీలో గళమెత్తిన ఆలేరు ఎమ్మెల్యే,ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య

అసెంబ్లీలో గళమెత్తిన ఆలేరు ఎమ్మెల్యే,ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య

అసెంబ్లీలో గళమెత్తిన ఆలేరు ఎమ్మెల్యే,ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య
April 01, 2026 06:57 PM 4 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

నియోజకవర్గ సమస్యలతో పాటు ప్రజా సంక్షేమ అంశాలపై సుదీర్ఘంగా ప్రసంగించారు.

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఆలేరు ఎమ్మెల్యే,ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య నియోజకవర్గ సమస్యలతో పాటు ప్రజా సంక్షేమ అంశాలపై సుదీర్ఘంగా ప్రసంగించారు.ప్రజా పాలనలో ప్రభుత్వం అందిస్తున్న పథకాలను వివరిస్తూనే,ప్రతిపక్షాల తీరును తీవ్రంగా ఎండగట్టారు. ఈ ఎనిమిదోవ అసెంబ్లీ సమావేశాలలో భాగంగా అన్ని రోజులతో కలిపి సుమారుగా 40నిమిషాలు అన్ని అంశాలపై మాట్లాడారు."నియోజకవర్గ అభివృద్ధి-సాగునీటి ప్రాజెక్టులు:​15వ కెనాల్ మరియు సాగునీరు:ఎల్లంపల్లి నుంచి మల్లన్నసాగర్ ద్వారా ఆలేరు నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలకు సాగునీరు అందుతుందని పేర్కొన్నారు.15వ కెనాల్‌కు అదనపు ఓటీలను ఏర్పాటు చేయడం ద్వారా ఆలేరులోని మరికొన్ని ప్రాంతాలను సస్యశ్యామలం చేయాలని కోరారు."​ప్రాజెక్టుల పురోగతి:గంధమల్ల ప్రాజెక్టు పనుల పురోగతిపై ప్రస్తావిస్తూ, పనులను వేగవంతం చేయాలన్నారు."నష్టపరిహారం:బస్వాపూర్ ప్రాజెక్టులో భూములు కోల్పోయిన లప్ప నాయక్,చోక్లా తండా బాధితులకు,అలాగే భువనగిరి-రాయగిరి ప్రాంతాల్లో త్రిబుల్ ఆర్ (రీజనల్ రింగ్ రోడ్)భూ బాధితులకు తక్షణమే నష్టపరిహారం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు.

"​వైద్యం మరియు ఆరోగ్యం:​ఆరోగ్యశ్రీ పేదవాడి ఆరోగ్యం కోసం ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.5 లక్షల నుండి రూ.10 లక్షలకు పెంచినందుకు ప్రభుత్వాన్ని అభినందించారు. తెలుగు సీలు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా బాధిత కుటుంబాలకు భరోసాగా నిలుస్తుంది అన్నారు.''​ఆసుపత్రి ఆధునీకరణ: ఆలేరు ప్రభుత్వ ఆసుపత్రిని 50 పడకల ఆసుపత్రిగా అప్‌గ్రేడ్ చేయాలని మరియు డయాలసిస్ సెంటర్‌లో బెడ్ల సంఖ్యను పెంచి రోగులకు భరోసా కల్పించాలని కోరారు."నిషేధిత భూములు- గృహ నిర్మాణం:నిషేధిత జాబితా:ఇళ్లు, ఇళ్ల స్థలాలను నిషేధిత జాబితా నుండి తొలగించి,సామాన్యుల క్రయవిక్రయాలకు ఇబ్బంది లేకుండా చూడాలని కోరారు."ఇందిరమ్మ ఇళ్లు:- తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ ప్రక్రియ వేగంగా సాగుతోందని హర్షం వ్యక్తం చేశారు. ఇందిరమ్మ ఇళ్ల విషయంలో టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల కొన్ని సమస్యలు తలెత్తడం జరిగిందని వాటి పరిష్కారం కోసం కృషి చేయాలని కోరారు."ఉద్యోగ,కార్మిక మరియు సామాజిక "అంశాలు:​గిగ్ వర్కర్లు మరియు అంగన్వాడీలు: గిగ్ వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని కోరారు. అలాగే అంగన్వాడీ టీచర్లకు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం వేతనాలు పెంచి,వారి సమస్యలను తీర్చాలని విన్నవించారు. ఉపాధి హామీ పథకం (ఎం.జి.ఎన్.ఆర్.ఈ.జి.ఎస్) పేరు మార్చవద్దని,పాత చట్టాన్నే కొనసాగించాలని స్పష్టం చేశారు."​నిరుద్యోగం:రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో ప్రభుత్వం ముందుందని గుర్తు చేశారు.ప్రతిపక్షాల తీరుపై ఆగ్రహం:​ప్రజా పాలనలో జరుగుతున్న అభివృద్ధిని జీర్ణించుకోలేక బీఆర్ఎస్ఎ మ్మెల్యేలు సభా సమయాన్ని వృధా చేస్తున్నారని మండిపడ్డారు. అసెంబ్లీని తప్పుదారి పట్టిస్తూ అరాచకానికి పాల్పడుతున్న సభ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే వారి సభ్యత్వాన్ని రద్దు చేయాలని సభాపతిని కోరారు. నియోజకవర్గంలో అధ్వానంగా ఉన్నరోడ్లను వెంటనే బాగు చేసి ప్రయాణికుల ఇబ్బందులు తొలగించాలని కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News